2గ.లపాటు నరసింహన్ విచారణ: రాజీనామా చేస్తారా?

అంతకుముందు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు బుధవారం రాజ్ భవన్కు చేరుకున్నారు. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం కేసులో నలుగురు సీబీఐ అధికారులు నరసింహన్ను సాక్షిగా ప్రశ్నించేందుకు చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే ఆయనను ప్రశ్నించారు.
కాగా, ఆగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కున్న ఇద్దరు గవర్నర్లు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను ఎదుర్కోనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా రాజీనామా చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఆగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో సాక్షులుగా విచారణను ఎదుర్కున్న తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఎంకె నారాయణన్, గోవా గవర్నర్గా బివి వాంచూ రాజీనామాలు చేశారు. గత వారం సిబిఐ అధికారులు వారిద్దరినీ విచారించారు.
ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను బుధవారం సిబిఐ అధికారులు విచారించేందుకు రాజ్ భవన్కు వచ్చారు. నరసింహన్ను కూడా సిబిఐ అధికారులు సాక్షిగా విచారిస్తున్నారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం సంబంధించి అధికారులు సాంకేతికపరమైన వివరాలు తీసుకున్న సమయంలో నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా ఉన్నారు. నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. అలాగే బీవీ వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ హెడ్గా ఉన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications