ఐఏఎస్ డికే రవి మృతి కేసు: కారు డ్రైవర్ స్టేట్ మెంట్ కీలకం
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. డికే.రవి కారు డ్రైవర్ ఎళంగోవన్ ఈ కేసులో మొదటి సాక్షి అని సీబీఐ అధికారులు అంటున్నారు.
ఎళంగోవన్ కు సమన్లు జారీ చేసిన సీబీఐ అధికారులు అతనిని విచారణ చేస్తున్నారు. అదే విధంగా డికే. రవి భార్య కుసుమ, మామ హనుమంతరాయప్ప, కుటుంబ సభ్యులను విచారణ చెయ్యాలని భావించారు. రవి మృతి కేసులో డ్రైవర్ చెప్పే విషయాలు కీలకం కానున్నట్లు భావిస్తున్నారు.
డ్రైవర్ విచారణకు అధిక ప్రాధాన్యత!

గత మార్చి 16వ తేదీన కోరమంగల సమీపంలోని అపార్ట్ మెంట్ లో డికే రవి అనుమానాస్పదస్థితిలో మరణించారు. డికే రవిని కారులో అపార్ట్ మెంట్ దగ్గరకు పిలుచుకుని వెళ్లింది ఎళంగోవన్. డికే. రవి చివరి సారి ఎదురెదురుగా మాట్టాడింది కారు డ్రైవర్ ఎళంగోవన్ తోనే.
అయితే ఆరోజు నాగరబావిలోని మామ ఇంటి నుండి బయలుదేరిన డికే రవి కార్యాలయానికి చేరుకున్నారని, తరువాత అపార్ట్ మెంట్ కు వెళ్లారని వెలుగు చూసింది. అయితే ఆ మధ్యలో డికే రవి ఎవరెవరితో మాట్లాడారనే విషయం తెలియాలంటే ఎళంగోవన్ చెప్పే వివరాలు కేసు దర్యాప్తులో కీలకం కానుంది.
గతంలో కేసు దర్యాప్తు చేసిన బెంగళూరు సీఐడి అధికారులు ఎళంగోవన్ ను ప్రశ్నించారు. ఆ సందర్బంలో డికే రవి వ్యక్తి గత కారణాల వలన ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఎళంగోవన్ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు సీబీఐ అధికారులు ఎళంగోవన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకుంటున్నారు.
సీబీఐ కొత్త కేసు నమోదు!
రవి మరణించిన సమయంలో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గురువారం సీబీఐ అధికారులు కొత్త కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవి మరణించకు ముందు ఒక వారం ఎవరెవరిని కలిశారనే వివరాలు సేకరిస్తున్నారు.
డికే రవి వాణిజ్య పన్నుల విభాగం జాయింట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల దగ్గర ముక్కు పిండి కొన్ని కోట్ల రూపాయల వాణిజ్య పన్ను వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేశారు. ఆ సమయంలో ఎవరైనా డికే. రవిని బెదిరించారా అని ఆరా తీస్తున్నారు.
కోలారులో విచారణ!
సీబీఐ అధికారులు బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక బృందం కోలారు వెళ్లి విచారణ చేస్తున్నారు. రవి కోలారులో పని చేసే సమయంలో స్యాండ్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేశారు. ఆ సమయంలో కోందరు రాజకీయ నాయకులు రవిని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications