మూడేళ్ళలో మురుగుకాలువలు, సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సమయంలో ఎంతమంది మరణించారో తెలుసా?
గత మూడు సంవత్సరాలలో ప్రమాదకరంగా ఉన్న మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్ సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా 161 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. అయితే మ్యాన్యువల్ పారిశుద్ధ్య పనుల వల్ల మరణాలు సంభవించినట్లు నివేదిక లేదని పేర్కొన్నారు.

మాన్యువల్ పారిశుధ్య పనులలో ప్రమాదాల వల్ల మూడేళ్ళలో 161 మంది మృతి
గత మూడేళ్లలో ప్రమాదకరమైన మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంక్లను శుభ్రపరిచే సమయంలో సంభవించిన ప్రమాదాల వల్ల 161 మంది మరణించారని ప్రభుత్వం బుధవారం తెలిపింది. 2019లో 118 మంది, 2020లో 19 మంది, 2021లో 24 మంది మరణాలు నమోదయ్యాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే, మాన్యువల్ స్కావెంజింగ్ వల్ల మరణాలు సంభవించినట్లు ఎటువంటి నివేదిక లేదని ఆయన తెలిపారు.

తమిళనాడులో అత్యధికంగా పారిశుధ్య కార్మికులు మృతి
తమిళనాడులో అత్యధికంగా 27 మంది, ఉత్తరప్రదేశ్లో 26 మంది మరణించారని ఆయన తెలిపారు.గత మూడేళ్లలో ఎంత మంది మాన్యువల్ స్కావెంజర్లు మరణించారో తెలుసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి మహేష్ పొద్దా అడిగిన ప్రశ్నకు సమాధానంగా వీరేంద్ర కుమార్ ఈ ప్రకటన చేశారు.
మాన్యువల్గా స్కావెంజింగ్ చేయడం వల్ల జరిగే మరణాలను ప్రభుత్వం గుర్తించదు కానీ వాటిని సెప్టిక్ ట్యాంక్లు మరియు మురుగు కాలువలను శుభ్రం చేసే సమయంలో సంభవించిన ప్రమాద మరణాలుగా పిలుస్తుంది.

చేతులతో పారిశుధ్య పనులు చెయ్యటం నిషేధం
మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, సామాజిక న్యాయం మరియు సాధికారత సహాయ మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ, 1993 నుండి మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంక్లను శుభ్రం చేస్తున్నప్పుడు 971 మంది మరణించారని వెల్లడించారు. మాన్యువల్ స్కావెంజర్స్ మరియు వారి పునరావాస చట్టం, 2013 ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధించబడింది. మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడం అనేది ఇప్పుడు నిషేధించబడిన మాన్యువల్ స్కావెంజింగ్.

యూపీలో అత్యధికంగా పారిశుధ్య కార్మికులు
2013 మరియు 2018లో రెండు వేర్వేరు సర్వేల్లో దేశవ్యాప్తంగా 58,098 మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించామని, వారందరికీ మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం (SRMS) పథకం కింద 40,000 రూపాయలు ఒకేసారి నగదు సహాయం అందించామని మంత్రి లోక్ సభకు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారని ఆయన తెలిపారు. మరుగుదొడ్లు మరియు మాన్యువల్ స్కావెంజర్ల డేటాను గుర్తించడానికి మరియు జియోట్యాగ్ చేయడానికి మంత్రిత్వ శాఖ 2020లో మొబైల్ యాప్ - స్వచ్ఛత అభియాన్ - ప్రారంభించిందని మంత్రి వీరేంద్ర కుమార్ చెప్పారు.

మాన్యువల్ గా పారిశుధ్య పనులపై ప్రభుత్వ ప్రకటనపై స్పందన
ప్రభుత్వం ప్రకటనపై స్పందిస్తూ, దేశం నుండి మాన్యువల్ స్కావెంజింగ్ను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపకుడు బెజవాడ విల్సన్ ఇలా అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ మరియు జమ్మూ & కాశ్మీర్లలో డ్రై లెట్రిన్లను శుభ్రం చేసే పద్ధతి చాలా ప్రబలంగా ఉంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయని, తాము అదే విషయాన్ని పంచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, సఫాయి కర్మచారిలను ప్రభుత్వం మరియు పోలీసులు వేధిస్తున్నారు అని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితులలో, ప్రజలు వచ్చి బహిరంగంగా చెప్పకపోవచ్చని పేర్కొన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications