Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్ :గ్రామీణ రంగానికి నిధుల వరద,మహిళ శక్తి కేంద్రాలు,ప్రతి ఒక్కరికీ ఇళ్ళ నిర్మాణం

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రంగానికి అధిక నిధులను కేటాయించింది.గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిధులను కేంద్రం కేటాయించింది.

న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిధులను కేటాయించింది. 2017..18 ఆర్థిక సంవత్సరంలో 24 శాతం అధికంగా రూ.1,87,200 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద ఖర్చుచేసే నిధులను రూ.38,500 కోట్ల నుండి రూ48 వేల కోట్లకు పెంచారు.ఈ పథకంలో మహిళల భాగస్వామ్యాన్ని 55 శాతానికి పెంచారు.

గ్రామస్థాయిలో గ్రామీణ మహిళల సాధికారతను పెంచేందుకు ఉద్దేశించిన మహిళా శక్తి కేంద్రాలను ఈ ఆర్థిక సంవత్సరం నుండే నెలకొల్పనున్నారు.

central government allocated huge funds for rural development in budget

వచ్చే ఏడాది మే 1 వ, తేది నాటికి దేశంలోని వందశాతం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు.ఇప్పటికీ పూరిగుడిసెల్లో నివసిస్తోన్న ఇల్లులేని నిరుపేదలకు 2019 నాటికి కోటి ఇళ్ళను నిర్మించనున్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసే రుణాలకు కాలపరిమితిని 15 ఏళ్ళ నుండి 20 ఏళ్ళకు పొడిగించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులను రూ.15 వేల కోట్ల నుండి రూ.23 వేల కోట్లకు పెంచారు.ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 2011..2014 మధ్య రోజుకు 73 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాలు జరిగితే 201617 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 133 కిలోమీటర్ల నిర్మించేలా వేగాన్ని పెంచారు.

పైపుల ద్వారా నీటిని అందించే పథకంలో బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+