బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణ సహా తెలుగు పద్మలు వీరే
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 139 మందికి ఈ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ఎంపిక చేసింది. పద్మ అవార్డు అందకున్నవారిలో పలువురు తెలుగువారు కూడా ఉండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కింది. నందమూరి బాలకృష్ణకు కళల విభాగంలో పద్మభూషణ్ పుస్కారం లభించింది. తెలంగాణకు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం)కి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

పద్మ విభూషణ్ పురస్కారం వరించింది వీరినే
దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), తెలంగాణ
జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్-(ప్రజా వ్యవహారాలు), చండీగఢ్
కుముదిని రజినీకాంత్ లాఖియా(కళలు), గుజరాత్
లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు), కర్ణాటక
శారదా సిన్హా (కళలు), బీహార్
ఎంటీవీ వాసుదేవన్ నాయకర్ (మరణానంతరం(సాహిత్యం, విద్య), కేరళ
ఓసాము సుజుకీ (మరణానంతరం(వాణిజ్యం, పరిశ్రమలు), జపాన్
For the year 2025, the President has approved conferment of 139 Padma Awards including 1 duo case (in a duo case, the Award is counted as one) as per list below. The list comprises 7 Padma Vibhushan, 19 Padma Bhushan and 113 Padma Shri Awards.
— ANI (@ANI) January 25, 2025
Late folk singer Sharda Sinha… pic.twitter.com/vxf5SL3ny6
పద్మభూషణ్ పురస్కారం వీరికే
నందమూరి బాలకృష్ణ (కళలు), ఆంధ్రప్రదేశ్
అజిత్ కుమార్ (కళలు), తమిళనాడు
శేఖర్ కపూర్ (కళలు), మహారాష్ట్ర
శోభన చంద్రకుమార్ (కళలు), తమిళనాడు
సుశీల్ కుమార్ మోడీ (మరణానంతరం(ప్రజా వ్యవహారాలు), బీహార్
వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), అమెరికా
ఎ సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం), కర్ణాటక
అనంత్ నాగ్ (కళలు), కర్ణాటక
బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం(సాహిత్యం, విద్య), ఎన్సీటీ ఢిల్లీ
జతిన్ గోస్వామి (కళలు), అస్సాం
జోస్ చాకూ పెరియప్పురం (వైద్యం), కేరళ
కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఆర్కియాలజీ), ఎన్సీటీ ఢిల్లీ
మనోహర్ జోషీ (మరణానంతరం(ప్రజా వ్యవహారాలు), మహారాష్ట్ర
నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు), తమిళనాడు
పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు), కేరళ
పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు), గుజరాత్
పంకజ్ ఉదాస్ (మరణానంతరం(కళలు), మహారాష్ట్ర
రామ్ బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం), ఉత్తరప్రదేశ్
సాధ్వీ రీతంభర (సామాజిక సేవ), ఉత్తరప్రదేశ్.
తెలుగు పద్మశ్రీ పురస్కారాలు వీరికే
మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), తెలంగాణ
కేఎల్ కృష్ణ (సాహిత్యం, విద్య), ఆంధ్రప్రదేశ్
మాడుగుల నాగఫణిశర్మ (కళలు), ఆంధ్రప్రదేశ్
మిరియాల అప్పారావు (మరణానంతరం (కళలు), ఆంధ్రప్రదేశ్.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications