కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం: వలసకూలీల కోసం ఏం చర్యలు తీసుకున్నారు..?
వలసకూలీల వెతలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. తమ సొంత ఊరికి వెళ్లేందుకు కూలీలు కాలినడకన, ట్రక్కుల్లో వెళుతోన్న విదారకర దృశ్యాలు.. మీడియాలో చూస్తున్నామని, పత్రికల్లో చదువుతున్నామని పేర్కొన్నది. లక్షలాది మంది వలసకూలీల సమస్యలపై సంబంధించి వార్తా పత్రికల కథనం ఆధారంగా సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. వలసకూలీలు రవాణా సౌకర్యం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్ను మంగళవారం విచారించింది. వలసకూలీలకు వెంటనే రవాణా, ఆహారం, వసతి సదుపాయం కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ రోజుకు కూడా వలసకూలీల సమస్య ఉంది అని గుర్తుచేసింది.

లాక్ డౌన్ ఉన్న సందర్భంగా వలసకూలీల సమస్యలను పట్టించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. సొంత గ్రామాలకు వెళ్లే క్రమంలో కూలీలు మృత్యువాత పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
-
మొబైల్ డేటాపై కేంద్రం పన్ను? GB పై ఎంత ట్యాక్స్? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో











Click it and Unblock the Notifications