Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమిలి దిశగా కేంద్రం మరో అడుగు-వచ్చే ఏడాది జనగణన, పూర్తవగానే పునర్విభజన..!

దేశవ్యాప్తంగా రెగ్యులర్ గా జరగాల్సిన జనాభా గణన కార్యక్రమాన్ని కరోనా పేరుతో వరుసగా వాయిదా వేసుకుంటూ వస్తున్న కేంద్రం ఎట్టకేలకు దీని నిర్వహణకు సిద్దమైంది. ఇప్పటికే దేశంలో జనాభా గణన చేపట్టకపోవడం, కులగణన డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనిపై రేపోమాపో అధికారిక ప్రకటన రానుంది. దీని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా చేపట్టనున్నారు.

ఇప్పటికే పదేళ్లకోసారి జరగాల్సిన జనాభా గణనను కరోనా కారణంగా నాలుగేళ్లుగా కేంద్రం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే వచ్చే ఏడాది ప్రారంభించినా ఇది పూర్తయ్యే సరికి 2026 అవుతుందని అంచనా వేస్తున్నారు. 2026 చివరి నాటికి జనాభా గణన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇది పూర్తి కాగానే లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టనున్నారు.

centre to hold census from 2025 plans lok sabha seats delimitation by 2028

దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టాల్సిన గడువు 2026. దీంతో 2026లో దేశవ్యాప్తంగా ఒకేసారి నియోజకవర్గాల పునర్ విభజన ప్రారంభం కానుంది. ఇది 2028 వరకూ సాగుతుందని అంచనా వేస్తున్నారు. దీని తర్వాత జమిలి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. అంటే 2028లో జమిలి ఎన్నికలు ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు జనాభా గణనలో ఈసారి కూడా మత, సాంఘిక వివరాలు, ఇతర అంశాలు తప్పకుండా ఉంటాయి. అయితే కుల గణన మాత్రం ఉండే అవకాశాలు లేవు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+