గతంలో భారతదేశం ఎప్పుడు ఉపగ్రహాల ప్రయోగం చేయలేదా : మమతా బెనర్జీ
దేశ ఆర్ధిక పతనం నుండి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. చంద్రయాన్ ప్రయోగం దేశంలో మొదటి సారి జరుగుతుందా అంటూ ఆమే ప్రశ్నించారు.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎప్పుడు ఇలాంటీ ప్రయోగాలు జరగలేదా అంటూ విమర్శించారు.
మరి కొద్ది గంటల్లో చంద్రయాన్2 విజయవంతంగా ప్రయోగం పూర్తికానుండడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే చంద్రయాన్ 2 ప్రధాని మోడీ నేరుగా వీక్షించనున్నారు. ఈనేపథ్యంలనే చంద్రయాన్2 ప్రయోగంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు.చంద్రయాన్ 2 ప్రయోగాన్ని కేంద్రం తనకు అనూకూలంగా మలచుకుని దేశంలో ఉన్న ఆర్ధిక మాంద్యం నుండి ప్రజల దృష్టి మరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో ఇలాంటీ ప్రయోగాలు ఎప్పుడు జరగలేదా అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆమే నేరుగా అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా చంద్రయాన్ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో చంద్రునిపై ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించిన అమెరికా, రష్యా మరియు చైనా తరువాత భారతదేశం నాల్గవ దేశంగా అవతరిస్తుంది. ఆగస్టు 29, 2009 సంవత్సరంలో ఇక 312 రోజుల పాటు శ్రమించి చంద్రయాన్ 1ను విజయవంతంగా ప్రయోగించారు.












Click it and Unblock the Notifications