Chandrayaan-3: బెంగళూరులో అడుగుపెట్టిన ప్రధాని మోడీ, సిటీలో సంబరం
బెంగళూరు: చంద్రునిపై విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంతోపాటు వారితో సంభాషించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం కర్ణాటకలోని బెంగళూరులో అడుగుపెట్టారు.
శనివారం ఉదయం 7.15 గంటలకు ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISTRAC)ను మోడీ సందర్శిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. "ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే బెంగళూరు చేరుకుంటారు" అని పేర్కొంది.

ప్రధాని మోడీ బెంగళూరు పర్యటన వివరాలు:
చంద్రయాన్-3 మిషన్లో కనుగొన్న విషయాలు, పురోగతి గురించి నరేంద్ర మోడీకి ఇస్రో శాస్త్రవేత్తలు వివరించనున్నారు. బెంగళూరులో దిగిన తర్వాత, మోడీ ట్విట్టర్ వేదికగా.. "చంద్రయాన్-3 విజయంతో భారతదేశం గర్వపడేలా చేసిన మా అసాధారణమైన ఇస్రో శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాము. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాల వెనుక వారి అంకితభావం, అభిరుచి నిజంగా చోదక శక్తులు అని పేర్కొన్నారు.
Landed in Bengaluru. Looking forward to interacting with our exceptional @isro scientists who have made India proud with the success of Chandrayaan-3! Their dedication and passion are truly the driving forces behind our nation's achievements in the space sector.
— Narendra Modi (@narendramodi) August 26, 2023
బెంగుళూరులోని ISTRAC వెలుపల పోలీసులు, ఇస్రో అధికారులు గుమిగూడినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ మోడీ శాస్త్రవేత్తలను కలవనున్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ల రెండు దేశాల పర్యటన తర్వాత ప్రధానికి స్వాగతం పలికేందుకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
మరోవైపు, మోడీకి ఘన స్వాగతం పలికేందుకు హెచ్ఏఎల్ విమానాశ్రయం వెలుపల అనేక మంది ప్రజలు గుమిగూడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మోడీకి రెండు ప్రదేశాలలో స్వాగతం పలుకుతారని బీజేపీ నేతలు చెప్పారు. HAL విమానాశ్రయం వెలుపల, ISTRACకి దగ్గరగా ఉన్న జలహళ్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున ప్రజలు గుమిగూడారు. అయితే, ఎలాంటి రోడ్షో ఉండదని స్పష్టం చేశారు.
'ఇది మాకు గర్వకారణమైన క్షణం ఎందుకంటే ఇది చాలా పెద్ద విజయం. చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న ఇస్రో బృందంలోని శాస్త్రవేత్తలను కలవడానికి ప్రధాని మోడీ బెంగళూరుకు వస్తున్నందుకు మేము ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడకు వచ్చాము' అని స్థానికులు తెలిపారు.
#WATCH | Karnataka | Locals with posters and the national flag gather on the streets outside HAL airport in Bengaluru to welcome PM Narendra Modi as he will meet scientists of ISRO team involved in the Chandrayaan-3 Mission at ISRO Telemetry Tracking & Command Network Mission… pic.twitter.com/mV4fapzLDZ
— ANI (@ANI) August 26, 2023
ఇదిలా ఉండగా, మోడీకి స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి సమీపంలో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. 15వ బ్రిక్స్ సమ్మిట్కు హాజరైన సమయంలో జోహన్నెస్బర్గ్ నుంచి ల్యాండర్ విక్రమ్ చారిత్రాత్మక టచ్డౌన్ ప్రత్యక్ష ప్రసారాన్ని మోడీ వీక్షించారు.
ఇస్రో కేంద్రానికి దారితీసే రోడ్ల కోసం ట్రాఫిక్ అడ్వైజరీ ఇప్పటికే విడుదల చేశారు. ఉత్తర బెంగళూరు రోడ్లపై ఆంక్షలు విధించారు. అయితే, తూర్పు, మధ్య బెంగళూరు రోడ్లపై ఉదయం 6:30 నుంచి 9:30 వరకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వెళ్లేదారిలో ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు.
#WATCH | Karnataka | PM Narendra Modi greets people gathered outside HAL airport in Bengaluru.
— ANI (@ANI) August 26, 2023
PM Modi will meet scientists of the ISRO team involved in Chandrayaan-3 Mission at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex. pic.twitter.com/70owpeWwlF
బుధవారం సాయంత్రం చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో భారతదేశంపై ప్రపంచ దేశాలు ప్రశంసలుకురిపించాయి. చారిత్రాత్మక ఘనతను సాధించిన మొదటి దేశంగా నిలిచింది భారత్. నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్పై నిరాశకు ముగింపు పలికింది.
చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగిన అమెరికా, చైనా, రష్యాల తర్వాత భారత్ నాలుగో దేశంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న అంతరిక్ష నౌకను ప్రయోగించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
బయటపడ్డ రహస్య ప్రపంచం, 7 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!











Click it and Unblock the Notifications