Cheating: ఐటీ హబ్ లో నకిలి కాల్ సెంటర్లు, ఉద్యోగులతో ?, అమెరికా ప్రజల టార్గెట్, కిలాడీలు !
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ప్రముఖ టెక్ పార్క్ లో ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వందలాది మంది ఉద్యోగులు ఈ కాల్ సెంటర్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. కాల్ సెంటర్ లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు ఎప్పటిలాగే ఉద్యోగాలకు వెళ్లారు. అయితే ఆఫీసుకు వెళ్లిన కాల్ సెంటర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అది నకిలి కాల్ సెంటర్ అని తెలుసుకున్న ఉద్యోగులు బిత్తరపోయారు.
ఇంతకాలం మీరు నకిలి కాల్ సెంటర్ లో ఉద్యోగాలు చేశారని పోలీసులు చెప్పడంతో ఉద్యోగులు బిత్తరపోయారు. ఉద్యోగులు తేరుకునే లోపు నకిలి కాల్ సెంటర్ నిర్వహకులకు సహకారం అందిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నకిలి కాల్ సెంటర్ లు ఏర్పాటు చేసిన గుజరాత్ కు చెందిన కిలాడీలు చేసిన పనికి ఇప్పుడు ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ లోని గాయిత్రీ టెక్ పార్క్ లో ఎథికల్ ఇన్ఫో ప్రై.లి. కంపెనీ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అమెరికాలోని అమాయక ప్రజలను టార్గెట్ చేసుకున్న కాల్ సెంటర్ నిర్వహకులు వారికి ఫోన్లు చెయ్యడం, మీ అకౌంట్ లో డబ్బులు బదిలి అయ్యిందా అని మాయమాటలు మాట్టాడి లైన్ లో పెడుతున్నారని పోలీసులు అన్నారు.
అమెరికా ప్రజలను మాత్రమే టార్గెట్ చేసుకున్న కాల్ సెంటర్ నిర్వహకులు తరువాత వారి అకౌంట్ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలి చేసుకుంటున్నారని పోలీసులు అంటున్నారు. రెండు సంవత్సరాల నుంచి అమెరికా ప్రజలను మోసం చేస్తున్న కాల్ సెంటర్ నిర్వహకులు రిషి వ్యాస్ ప్రతిక్, హరీష్, హేత్ పటేల్, కిరణ్, సయ్యద్ తో పాటు 11 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు ఎక్కువ మంది గుజరాత్ కు చెందిన వారే అని పోలీసు అధికారులు అంటున్నారు. నిందితుల నుంచి రూ. 2 కోట్ల విలువైన కంప్యూటర్లు, విలువైన వస్తువులు రూ. 18 లక్షల నగదు సీజ్ చేశామని బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీసులు తెలిపారు.