చెన్నై ఎయిర్ ఇండియా డింపుల్ కిడ్నాప్, ఫ్రెండ్ కింగ్ పిన్, మేనేజర్ కు రూ. 26 లక్షలు, ఏం జరిగిందంటే?!
చెన్నై: ఉద్యోగం పేరిట మోసానికి పాల్పడిన కేసులో చెన్నై ఎయిర్ పోర్టు మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చెయ్యడం, కమిషనర్ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో తమిళనాడు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మహిళా, ఆమె స్నేహితుడు మోసం చేసి రూ. లక్షలు వసూలు చేశారని అనేక ఆరోపణలు రావడం, వసూలు చేసిన నగదులో రూ. 26 లక్షలు ప్రైవేటు విమాన సంస్థ మేనేజర్ కు కమిషన్ గా ఇచ్చామని మహిళా ఉద్యోగి పోలీసులకు చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

చెన్నై ఎయిర్ ఇండియా
తమిళనాడులోని తంజావూర్ జిల్లా, పేరాపురానికి చెందిన కాళిముత్తు కుమార్తె డింపుల్ (25) చెన్నై ఎయిర్ ఇండియా విమాన సంస్థ వాణిజ్య విభాగంలో ఉద్యోగం చేస్తున్నది. డింపుల్ కు ఎక్కువ మంది బందువులు, స్నేహితులు ఉన్నారు. డింపుల్ తో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద బందువులకు ఎంతో నమ్మకం ఉంది.

విమాన సంస్థలో ఉద్యోగాలు
తనకు తెలిసిన ప్రైవేటు విమాన సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాల మంది దగ్గర డింపుల్ రూ. లక్షలు వసూలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు ఎంతకాలానికి ఉద్యోగాలు రాకపోవడంతో డింపుల్ మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారని తెలిసింది.

డింపుల్ కిడ్నాప్
సేలం స్టీల్ ప్లాంట్ సమీపంలోని నివాసం ఉంటున్న బంధువు సెబాస్టియన్ ను తన ఇంటికి రావాలని డింపుల్ చెప్పారు. ఆ సమయంలో డింపుల్ ఇంటికి వెళ్లిన బాధితులు ఆమెను కారులో కిడ్నాప్ చేసి నేరుగా పోలీసు కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. పోలీసులు డింపుల్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు.

మేనేజర్ ఓకే చెప్పారు
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డింపుల్ మీడియాలో మాట్లాడారు. తాను చెన్నై ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. తన స్నేహితుడైన విష్ణువాసన్ అలియాస్ విక్కి ఉద్యోగం ఇప్పించమని తనకు మనవి చేశాడని, తరువాత తాను ప్రైవేటు విమాన సంస్థ మేనేజర్ కు విషయం చెప్పానని, ఉద్యోగం ఇవ్వడానికి ఆయన ఓకే చెప్పారని డింపుల్ వివరించారు.

విక్కినే కింగ్ పిన్
ఉద్యోగాలు ఇప్పిస్తామని అనేక మంది దగ్గర విష్ణువాసన్ అలియాస్ విక్కి రూ. లక్షలు వసూలు చేసుకున్నాడని తనకు తెలిసిందని, తరువాత అందులో తనకు కేవలం రూ. 26 లక్షలు మాత్రమే ఇచ్చాడని, ఆ నగదు తాను ప్రైవేటు విమాన సంస్థ మేనేజర్ కు ఇచ్చానని, తాను సొంత ఖర్చులకు ఆ డబ్బులు ఉపయోగించుకోలేదని డింపుల్ వివరించారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు డింపుల్ నుంచి వివరణ తీసుకుని కేసును అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే డింపుల్ వ్యవహారంతో ఎయిర్ పోర్టు ఉద్యోగులు హడలిపోయారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications