చెన్నైలో కూలిన భవనం: మృతుల్లో తెలుగువారు

శనివారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించడంతో అప్పటికే పెక్కుమంది పని పూర్తి చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. భవనం శిథిలాల నుంచి బాధితుల ఆక్రందనలు వినిపిస్తున్నాయని సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. మృతులు ఉత్తరాంధ్రకు చెందినవారని తెలుస్తున్నది. భవనంలో 11 అంతస్తుల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి అయ్యింది.
శనివారంనాడు చెన్నైలో కుండపోతగా వర్షం కురిసింది. దీనివల్లే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నా. భవనం కూలిపోయిన విషయం తెలిసిన వెంటనే అరక్కోణంనుంచి జాతీయ విపత్తు నివారణకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో ఒక హెలికాప్టర్ బయలుదేరింది. అగ్నిమాపక దళ సిబ్బంది, వైద్యులు కూడా హుటాహుటిన తరలివచ్చారు. అధికారులు భవనం శిథిలాలను తొలగిస్తున్నారు. చెన్నైలోని పోరూరులో గల ముగలివాక్కం ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ భవన నిర్మాణానికి వచ్చిన వారిలో పెక్కుమంది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలనుంచి ఉపాధి కోసం వచ్చినవారే. విజయనగరంలోని మక్కువ, దత్తరాజేరు మొదలైన ప్రాంతాలకు చెందిన కూలీలు దాదాపు 15 మంది ఉన్నట్టు విజయనగరం కలెక్టర్కు ప్రాథమిక సమాచారం అందింది. అయితే 14 మంది విజయనగరం జిల్లావారు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి చిన్నరాజప్ప అన్నారు. ప్రమాదం సంభవించిన ప్రాంతంలో ఇప్పటివరకూ ఐదు అంతస్తుల నిర్మాణానికే అనుమతి ఉంది. 11 అంతస్తుల నిర్మాణానికి తొలిసారిగా అధికారులు అనుమతి ఇచ్చారు.
మృతుల్లో విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురున్నట్లు తెలుస్తోంది. బిల్డర్పై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారి విషయపయమై మంత్రి మృణాళిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
చెన్నైకి ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ బయలుదేరి వెళ్లారు. తమిళనాడు ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని చెప్పారు. చెన్నైకి ప్రభుత్వ బృందాన్ని పంపుతన్నట్లు తెలిపారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే చెప్పారు
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications