Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నైలో కూలిన భవనం: మృతుల్లో తెలుగువారు

Chennai building collapse
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్మాణంలో ఉన్న11 అంతస్తుల భవనం శనివారం సాయంత్రం కూలిపోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం రాత్రికి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ భవనం శిథిలాల క్రింద ఇంకా 50 మంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ భవన నిర్మాణంలో సుమారు 240 మంది పాల్గొన్నట్టు తెలుస్తున్నది. వీరిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర, ఒడిషా, బీహార్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందినవారేనని తెలుస్తోంది.

శనివారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించడంతో అప్పటికే పెక్కుమంది పని పూర్తి చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. భవనం శిథిలాల నుంచి బాధితుల ఆక్రందనలు వినిపిస్తున్నాయని సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. మృతులు ఉత్తరాంధ్రకు చెందినవారని తెలుస్తున్నది. భవనంలో 11 అంతస్తుల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి అయ్యింది.

శనివారంనాడు చెన్నైలో కుండపోతగా వర్షం కురిసింది. దీనివల్లే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నా. భవనం కూలిపోయిన విషయం తెలిసిన వెంటనే అరక్కోణంనుంచి జాతీయ విపత్తు నివారణకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో ఒక హెలికాప్టర్ బయలుదేరింది. అగ్నిమాపక దళ సిబ్బంది, వైద్యులు కూడా హుటాహుటిన తరలివచ్చారు. అధికారులు భవనం శిథిలాలను తొలగిస్తున్నారు. చెన్నైలోని పోరూరులో గల ముగలివాక్కం ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ భవన నిర్మాణానికి వచ్చిన వారిలో పెక్కుమంది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలనుంచి ఉపాధి కోసం వచ్చినవారే. విజయనగరంలోని మక్కువ, దత్తరాజేరు మొదలైన ప్రాంతాలకు చెందిన కూలీలు దాదాపు 15 మంది ఉన్నట్టు విజయనగరం కలెక్టర్‌కు ప్రాథమిక సమాచారం అందింది. అయితే 14 మంది విజయనగరం జిల్లావారు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి చిన్నరాజప్ప అన్నారు. ప్రమాదం సంభవించిన ప్రాంతంలో ఇప్పటివరకూ ఐదు అంతస్తుల నిర్మాణానికే అనుమతి ఉంది. 11 అంతస్తుల నిర్మాణానికి తొలిసారిగా అధికారులు అనుమతి ఇచ్చారు.

మృతుల్లో విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురున్నట్లు తెలుస్తోంది. బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారి విషయపయమై మంత్రి మృణాళిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

చెన్నైకి ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ బయలుదేరి వెళ్లారు. తమిళనాడు ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని చెప్పారు. చెన్నైకి ప్రభుత్వ బృందాన్ని పంపుతన్నట్లు తెలిపారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే చెప్పారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+