చెన్నైలో మిస్సింగ్ కేసు,ఆగ్రాలో సూట్కేస్,మణిపూర్లో నిందితులు-ఇదో క్రైమ్ కథా చిత్రం!
విశ్వాసమే పెట్టుబడిగా సాగే మనుషుల మధ్య,నయవంచనతో ప్రాణాలు తీసే కిరాతకులు కూడా సమాజంలో సంచరిస్తున్నారనడానికి చెన్నై నగర శివార్లలోని గూడువాంచేరిలో జరిగిన ఘటనే నిదర్శనం.సభ్య సమాజం తలదించుకునేలా,మానవత్వానికే మాయని మచ్చ తెచ్చేలా జరిగిన హయాతున్నిషా హత్యోదంతం ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది.కేవలం తన భవిష్యత్తుపై నమ్మకంతో ఒక వ్యక్తిని ఆశ్రయించినందుకు,ఆ మహిళకు ఎదురైన ఘోర పరాభవం,విగతజీవిగా మారిన వైనం వింటే ఎంతటి వారికైనా కన్నీళ్లు ఆగవు.
ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
చెన్నై గూడువాంచేరి ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల హయాతున్నిషా అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో ఆమె కుమారుడు తీవ్ర ఆందోళనతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాణాలతో తిరిగి వస్తుందనుకున్న తల్లి కోసం సాగిన అన్వేషణ చివరకు ఎంతటి విషాదాంతానికి దారితీసిందో ఊహించడానికే భయమేస్తుంది.కొద్ది రోజుల క్రితం,చెన్నై సెంట్రల్ నుంచి ఢిల్లీ వెళ్లే తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో ఆగ్రా సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక పాడుబడిన సూట్కేస్ లభ్యమైంది.ఆ సూట్కేస్ను తెరిచి చూసిన రైల్వే పోలీసులకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది.ఆ సూట్కేసు తెరిచి చూసిన రైల్వే పోలీసులకు లోపల తల,చేతులు లేని ఒక మహిళ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కనిపించడంతో ఈ భయంకర హత్యాకాండ వెలుగులోకి వచ్చింది.

ఆ సూట్కేస్లో లభించిన తల,చేతులు లేని దారుణమైన మొండెం తప్పిపోయిన హయాతున్నిషాదేనని డిఎన్ఏ,ఇతర శాస్త్రీయ ఆధారాల ద్వారా నిర్ధారణ కావడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ఘోర హత్య వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ వెలుగులోకి వచ్చిన భయంకరమైన నగ్న సత్యాలు చట్టాన్ని రక్షించే పోలీసులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.ఒక సాధారణ వివాహేతర సంబంధం ఇంతటి ఘోరానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు.
వ్యవస్థీకృత కుట్ర.. నమ్మించి హతమార్చిన తీరు
ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.మృతదేహం అదృశ్యమైన ఆమె ఇంట్లో రక్తపు మరకలతో కూడిన గిన్నెలు,మైదా పిండి లభించడం వారి అనుమానాలను బలపరిచింది.ఈ ఘాతుకానికి ఒడిగట్టిన అసోంకు చెందిన మానిక్ ఉద్దీన్ లస్కర్ (22),అతని ప్రియురాలు భగవతి మాఝీలను పోలీసులు మణిపూర్లో అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన నిజాలు వింటుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. మానిక్ ఉద్దీన్తో హయాతున్నీషాకు ఉన్న పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి నిరాకరించిన మానిక్ ఉద్దీన్, హయాతున్నీషా వద్ద నుంచి అప్పటికే డబ్బులు, నగలు తీసుకున్న ప్రియురాలు భగవతితో కలిసి ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు.
సందేహం రాకుండా ఉండేందుకు,ఇద్దరూ కలిసి రాజీ మాట్లాడుకుందామంటూ హయాతున్నీషా ఇంటికి వచ్చారు.దాదాపు రెండు వారాల పాటు ఆమెతో పాటే ఉంటూ హత్యకు పక్కా ప్రణాళిక రచించారు. పల్లవరం మార్కెట్ నుంచి మేకలను కోసే పదునైన కత్తులను కొనుగోలు చేశారు. ఒకరోజు రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో ముఖంపై మత్తుమందు చల్లి,ఆ తర్వాత గొంతు కోసి ప్రాణాలు తీశారు.ఆమె శరీరం నుండి కారిన రక్తాన్ని బిరియానీ వండే పెద్ద దబరాలో పట్టి ఉంచారు.
మృగాల కంటే ఘోరంగా..ఊహించని క్రూరత్వం
ఇంతటితో వారి రాక్షసత్వం ఆగలేదు.మృతురాలి కాళ్లను సీలింగ్ ఫ్యాన్కు కట్టి తలక్రిందులుగా వేలాడదీశారు.ప్రొఫెషనల్ హంతకుల్లా వ్యవహరిస్తూ,మేక చర్మాన్ని వలిచినట్లు హయాతున్నీషా శరీరంపై చర్మాన్ని వలిచేశారు.అనంతరం ఆమె చేతులు,కాళ్లు,శరీరాన్ని ముక్కలుగా నరికారు.గుర్తుపట్టకుండా ఉండేందుకు తలకు గుండు కొట్టించి,రెండు కళ్లను పీకేసి వాటిని ప్లాస్టిక్ కవర్లలో భద్రపరిచారు.ఆ నరరూప రాక్షసులు ఈ శరీర భాగాలన్నింటినీ ఒక ట్రావెలింగ్ సూట్కేసులో సర్దారు.స్థానిక సబర్బన్ రైలులో ప్రయాణించి చెన్నై సెంట్రల్ చేరుకుని,అక్కడ తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో ఆ సూట్కేసును వదిలేసి పరారయ్యారు.అనంతరం వారు కొద్దిరోజులు చెన్నైలోని బంధువుల ఇంట్లో తలదాచుకుని,పోలీసుల గాలింపు తీవ్రం కావడంతో మణిపూర్కు పారిపోయి తలదాచుకున్నారు.
ఈ ఘోరమైన మృగాళ్ల వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు నివ్వెరపోయారు.ఘటనా స్థలానికి వారిని తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేయడానికి సిద్ధమవుతున్నారు.కాగా,ఈ కేసులో మరో నలుగురు వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు కొత్త కోణం వెలుగులోకి రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేసే ఈ హత్యాకాండ చెన్నై నగరంలో తీవ్ర శోకాన్ని,భయాందోళనలను నింపింది.














Click it and Unblock the Notifications