encounter: తమిళనాడు యువకుడిని ఎన్ కౌంటర్ చేసిన సిడ్నీ పోలీసులు, ఆస్ట్రేలియాలో ?
చెన్నై/న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లిన యువకుడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీలుచిక్కినప్పుడు ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. విదేశాలల్లో ఉన్నా ఆ యువకుడ నిత్యం అతని స్నేహితులతో టచ్ లో ఉన్నాడు. డబ్బులు సంపాధించాలని విదేశాలకు వెళ్లిన యువకుడు ఆదేశంలోని పోలీసుల ఎన్ కౌంటర్ లో స్పాట్ లో చనిపోయాడు. అసలు ఎం జరిగింది అనే విషయంపై స్థానిక మీడియా పూర్తి సమాచారం వెళ్లడించింది.

తమిళనాడు టూ ఆస్ట్రేలియా
తమిళనాడులోని తంజావూరులోని అతిరామమ్ పట్నంలో మహ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ అలియాస్ సయ్యద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాధించాలని సయ్యద్ అనుకున్నాడు. 2019లో సయ్యద్ విజిటర్స్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. తరువాత ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ రెస్టారెంట్లో సయ్యద్ ఉద్యోగంలో చేశాడు.

సిడ్నీలో నివాసం ఉంటున్న సయ్యద్
ప్రతిరోజు రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్న సయ్యద్ అతని పని పూర్తి అయిన తరువాత లోకల్ మెట్రో రైలులో అతని ఇంటికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే సయ్యద్ పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి రైల్వేస్టేషన్ కు బయలుదేరాడు. సిడ్నీలోని పశ్చిమ రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్న 28 ఏళ్ల పారిశుద్ధ్య కార్మికుడి దగ్గరకు సయ్యద్ వెళ్లాడు. తరువాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది.

రైల్వేస్టేషన్ లో ఎన్ కౌంటర్
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సయ్యద్ కత్తితో పారిశుద్ద కార్మికుడిని దారుణంగా పొడిచేశాడు. సమీపంలో ఉన్న పోలీసులు విషయం గుర్తించి సయ్యద్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో సయ్యద్ అదే కత్తితో పోలీసుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని సమాచారం. ఆ సమయంలో లొంగిపోవాలని సిడ్నీ పోలీసులు చెప్పినా సయ్యద్ మాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది
సిడ్నీ పోలీసులను లెక్క చెయ్యకుండా మరోసారి వారి మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో సిడ్నీ పోలీసులు అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపారు. సయ్యద్ ఛాతీపై రెండు తుపాకీ తూటాలు దూసుకుపోవడంతో అతను చనిపోయాడని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ మీడియా కథనం వెళ్లడించింది. తమిళనాడుకు చెందిన సయ్యద్ సిడ్నీ పోలీసుల ఎన్ కౌంటర్ లో అంతం కావడంతో అక్కడి భారత రాయబారి కార్యాలయం అధికారులు పూర్తి సమాచారం కోసం ఆరా తీస్తున్నారని తెలిసింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications