Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసు: చిదంబరంను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. విచారణ కోసం చిదంబరం బుధవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధానకార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి పలు అంశాలపై సీబీఐ చిదంబరంను ప్రశ్నించింది.

చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన అనుమతులలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసులో చిదంరం కుమారుడు కార్తి చిదంబరం, ఐఎన్‌ఎక్స్‌ మీడియా మాజీ అధినేతలు పీటర్‌ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.

 Chidambaram questioned by CBI in connection with Aircel-Maxis case

ఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు(ఎఫ్‌ఐపీబీ)కి అనుమతి ఇవ్వడంలో చిదంబరం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గత ఏడాది మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ కార్తి చిదంబరంను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరాన్ని జులై 3 వరకు అరెస్ట్‌ చేయొద్దని దిల్లీ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కూడా ఆయనను జులై 10 వరకు అరెస్ట్‌ చేయొద్దని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+