నిర్మలా సీతారామన్ కు చైనా మీడియా ప్రశంస
కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. సిక్కింలోని నాథూ లా సరిహద్దు వద్ద ఆమె భారత సరిహద్దుకు అవతల ఉన్న చైనా సైనికులతో సంభాషించడాన్ని చైనా.
ఢిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. సిక్కింలోని నాథూ లా సరిహద్దు వద్ద ఆమె భారత సరిహద్దుకు అవతల ఉన్న చైనా సైనికులతో సంభాషించడాన్ని చైనా ప్రసార మాధ్యమాలు స్వాగతించాయి.
చైనా ప్రభుత్వ సారథ్యంలోని సీజీటీఎన్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. భారత రక్షణమంత్రి చొరవతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడే అవకాశముందని, అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగేందుకు దోహద పడుతుందని గ్లోబల్టైమ్స్ పేర్కొంది.

కొద్ది రోజుల కిందట నాథూ లా సమీపంలోని డోక్లాంలో చైనా సైన్యం నిర్మించతలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులను భారత సైన్యం అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో చైనా భారీగా సైన్యాన్ని మోహరించడంతో భారత్ కూడా భారీ ఎత్తున సైనికదళాలను రంగంలోకి దింపింది.
దాదాపు 70 రోజుల పాటు కొనసాగిన ఈ ప్రతిష్టంభన చివరికి చర్చలతో తొలగిపోయింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.
ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రక్షణమంత్రి సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. సరిహద్దు అవతల ఉన్న చైనా సైనికులతో ఆమె ఆంగ్లంలో మాట్లాడటం, నమస్తేను చైనా భాషలో ఎలా పలకాలో తెలుసుకోవడం తెలిసిందే.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications