టీఆర్ఎస్ వాళ్లంతే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే గెలుపు: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు ఇటీవల పార్లమెంటు ఆమోదం తెలిపిన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలతో పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 15 నిమాషాలపాటు మాట్లాడారు.

టీఆర్ఎస్ వాళ్లంతే..
పౌరసత్వ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రధాని స్పందించారు. టీఆర్ఎస్ వాళ్లు అలాగే ఉంటారని అన్నారు. దేశంలో కుటుంబ పార్టీలు కనుమరుగవుతున్నాయని చెప్పిన ఆయన.. పలు రాష్ట్రాలను ఉదాహరణగా చెప్పారు.

వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీనే..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీనే గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కష్టపడి పని చేయాలని రాష్ట్ర ఎంపీలకు ఆయన సూచించారు. అనంతరం తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందరినీ కలుపుకోవాలని సూచించారు.

మోడీకి సమ్మక్క, సారలమ్మ ప్రసాదం..
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని అందిచ్చారు. ఈ సందర్బంగా సమ్మక్క, సారలమ్మ దేవతల విశిష్టత గురించి ఎంపీ గరికపాటి ప్రధాని మోడీకి వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పార్టీకి సంబంధించిన పలు అంశాలను మోడీతో తెలంగాణ ఎంపీలు చర్చించారు.

దిశ ఎన్ కౌంటర్పై మోడీ ఆరా..
కాగా, దిశ నిందితుల ఎన్ కౌంటర్పైనా ఆరా తీశారు. ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన గురించి ప్రధాని తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు రోజు క్రితమే తీర్పునిచ్చిందని, వేచి చూడాలని ప్రధానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

అమల్లోకి పౌరసత్వ సవరణ బిల్లు
ఇది ఇలావుంటే, పార్లమెంటులో తాజాగా పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదించింది. సౌరసత్వ సవరణ బిల్లుకు 311 మంది సభ్యులు అనుకూలంగా, 80 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇక బుధవారం రాజ్యసభలో కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. 105 మంది సభ్యులు వ్యతిరేకంగా, 120 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో రాజ్యసభలో కూడా సౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసకు గురై డిసెంబర్ 31, 2014కు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లింమేతరులకు నిబంధనల ఆధారంగా ఇక్కడి పౌరసత్వం కల్పించనున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications