బెంగాల్ అమిత్ షా ర్యాలీలో రాళ్ల దాడి.. అదుపుచేసిన పోలీసులు
బీజేపీ చీఫ్ అమిత్ షా కోల్కతాలో పాల్గోన్న ర్యాలీలో ఘర్షణ చెలరేగింది. తృణములు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య రాళ్ల వర్షం కురిసింది. కాగా మంగళవారం సాయంత్రం అయిదు గంటలకు సేవ్ రిపబ్లిక్ పేరుతో సెట్రల్ కొల్కత్తా లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కోల్కతా యూనివర్సీటి వద్దకు వచ్చిన నేపథ్యంలోనే ఘర్షన చెలరేగినట్టు తెలుస్తోంది. దీంతో రెండు వర్గాల మధ్య రాళ్లు విసురుకున్న దృశ్యాలు కనిపించాయి. కొన్ని చోట్లు మంటలు కూడ చెలరేగినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులను ఇరువర్గాను చెదరగొట్టారు..
ఇక అంతకుముందు జరిగిన ర్యాలీ పెద్ద ఎత్త్రున కొనసాగింది..కలకత్తా వీధులన్ని సాఫ్రన్ మయం అయ్యాయి. వీధుల గుండా రామలక్ష్మణ్ కౌటౌట్ లతోపాటు పెద్ద పెద్ద అంజనేయ స్వామీ కౌటౌట్లతో ఊరేగింపు జరిగింది. అమీత్ వ్యాన్ వస్తున్న ఊరేగింపు పెద్ద ఎత్తున విజయవంతం చేశారు అక్కడి బీజేపీ కార్యకర్తలు..ఇక యూనివర్సిటి ప్రాంతంలో జరిగిన ఘర్షణకు కారణాలు ఏమిటనేదీ తెలియాల్సి ఉంది.

కాగా ఈనెల 19 న జరగనున్న చివరి దశ ఎన్నికల్లో కూడ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి..మొత్తం ఏడు దశల్లో కూడ పశ్చిమ బెంగాల్లో ఉన్న ఎన్నికలు ఉన్నాయి. దీంతో అటు మమతాబెనర్జీ, ఇటు ప్రధాని మోడీ మధ్య మాటల యుద్దం చెలరేగుతోంది. నేరుగా ప్రధాన మంత్రి మమతపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ చీఫ్ అమిత్ సైతం మమతపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. చివరి దశ ఎన్నికలు రెండు పార్టీలకు కీలకంగా మారడంతో టెన్షన్ పశ్చిమబెంగాల్లో టెన్సన్ వాతవరణ నెలకోంది.
West Bengal: Latest visuals from BJP President Amit Shah's roadshow in Kolkata after clashes broke out. pic.twitter.com/KvS7wlwRky
— ANI (@ANI) May 14, 2019
#WATCH: Visuals after clashes broke out at BJP President Amit Shah's roadshow in Kolkata. #WestBengal pic.twitter.com/laSeN2mGzn
— ANI (@ANI) May 14, 2019
Kolkata: Statue of Ishwar Chandra Vidyasagar was vandalised at Vidyasagar College in the clashes that broke out at BJP President Amit Shah's roadshow. #WestBengal pic.twitter.com/XSSWyYbMwu
— ANI (@ANI) May 14, 2019












Click it and Unblock the Notifications