వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
థర్డ్ ఫ్రంట్: రేపు బెంగళూరులో దేవేగౌడతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్/బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం మాజీ ప్రధాని దేవేగౌడను కలవనున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంతో వివిధ రాజకీయ పార్టీలతో ఆయన సమావేశమవుతోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో భేటీ అయ్యారు.
తాజాగా ఆయన దేవేగౌడతో మాట్లాడనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై అయిదు నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్తారు.
దేవేగౌడతో దేశ రాజకీయాలు, థర్డ్ ఫ్రంట్ అంశంపై చర్చిస్తారు. ఆ తర్వాత తిరిగి సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Comments
kcr k chandrasekhar rao karnataka assembly elections 2018 deve gowda third front కేసీఆర్ కే చంద్రశేఖర రావు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 థర్డ్ ఫ్రంట్
English summary
Telangana Chief Minister K Chandrasekahr Rao to meet former prime minister Deve Gowda in bangalore tomorrow.
Story first published: Thursday, April 12, 2018, 18:18 [IST]