బాలీవుడ్ పెద్దన్నకు రాఖీ కట్టిన దీదీ: అసలు భారత రత్న: ప్రతిపక్షాల భేటీ వేళ అనూహ్య చర్య
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు మూడో విడత భేటీకి సన్నద్ధమౌతోన్నాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో భేటీ కానున్నాయి. 27 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి.
దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే. గతంలో పాట్నా, బెంగళూరుల్లో భేటీ అయ్యాయి. మూడోసారి ముంబైలో ఉమ్మడి భేటీని నిర్వహించబోతోన్నాయి. ఇప్పటికే భాగస్వామ్య పార్టీల అధినేతలు ముంబైకి చేరుకున్నారు. ఈ విడత సమావేశంలోనే ఇండియా లోగోను కూడా ఆవిష్కరించనున్నాయి.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముంబైకి చేరుకున్నారు కూడా. ఈ మధ్యాహ్నం ముంబైకి వచ్చిన ఆమె నేరుగా జుహూలోని అమితాబ్ బచ్చన్ నివాసానికి వెళ్లారు. ఆయనను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలియజేశారు.

తమ ఇంటికి వచ్చిన మమత బెనర్జీని అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. అమితాబ్ భార్య, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆప్యాయంగా మమతను ఆలింగనం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వారి కూతురితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.
Maharashtra | West Bengal CM Mamata Banerjee met Bollywood actors Amitabh Bachchan and Jaya Bachchan at their residence in Mumbai, earlier today.
— ANI (@ANI) August 30, 2023
(Source: TMC) pic.twitter.com/PR8A9OPXZf
అనంతరం మమత బెనర్జీ.. విలేకరులతో మాట్లాడారు. తన దృష్టిలో అసలు సిసలు భారతరత్న అమితాబ్ బచ్చనేనని తేల్చి చెప్పారు. ముంబైకి వచ్చినప్పుడు తన ఇంటికి రావాలని ఆహ్వానించారని పేర్కొన్నారు. దసరా పండగ సందర్భంగా కోల్కతలో జరిగే దుర్గాదేవి పూజలకు హాజరు కావాలని బచ్చన్ కుటుంబాన్ని కోరినట్లు వివరించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications