వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM Seat: సంక్షోభం అంచుల వరకు వెళ్లి అగిపోయింది, కుర్చీ ఉంటుందో, ఊడుతుందో సీఎంకే క్లారిటీ లేదు!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/న్యూఢిల్లీ/సూరత్: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంక్షోభం అంచుల వరకు వెళ్లి అక్కడ ఆగింది. మహారాష్ట్రంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఉంటుందా ? ఊడుతుందా ? అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ లేకపోయినా ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి. రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్న ఎమ్మెల్యేలు చెయ్యిజారిపోకుండా ఉద్దవ్ ఠాక్రే అనుచరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోకుండా ఉండటానికి ఉద్దవ్ ఠాక్రే అనే చర్యలు తీసుకుంటున్నారు. ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేస్తే లెక్క ఓ రకంగా ఉంటుంది. బీజేపీ నాయకులు చెబుతున్న మాటల ప్రకారం లెక్క మరో రకంగా ఉంటోంది. మొత్తం మీద మహారాష్ట్రలో ప్రభుత్వం నిలబడాలంటే ఈ లెక్కన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.

Rebel: సీఎంకు సినిమా చూపించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఓటింగ్, గ్రేట్ ఎస్కేప్!Rebel: సీఎంకు సినిమా చూపించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఓటింగ్, గ్రేట్ ఎస్కేప్!

మహారాష్ట్రాలో ఎంత మంది ఎమ్మెల్యేలు అంటే?

మహారాష్ట్రాలో ఎంత మంది ఎమ్మెల్యేలు అంటే?

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 288, ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రే మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వానికి 152 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇటీవల శివసేన ఎమ్మెల్యే మరణించడంతో శాసన సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంటుంది

వాడికంటేనా

వాడికంటేనా

ఏ పార్టీకి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే!

బీజేపీ- 106 మంది ఎమ్మెల్యేలు

శివసేన- 55 మంది ఎమ్మెల్యేలు

కాంగ్రెస్- 44 మంది ఎమ్మెల్యేలు

ఎన్సీపీ- 53 మంది ఎమ్మెల్యేలు

ఎవరి లెక్కలు వాళ్లవే

ఎవరి లెక్కలు వాళ్లవే

మిగిలి చిన్నచిన్న పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతకాలం చిన్నచిన్న పార్టీల ఎమ్మెల్యేల మద్దతు మాకే ఉందని ఉద్దవ్ ఠాక్రేలోని సంకీర్ణ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. మా పార్టీలోని 106 మంది ఎమ్మెల్యేలతో పాటు మాకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య 135 ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు.

అంతా ఏక్ నాథ్ చేతిలో ఉంది

అంతా ఏక్ నాథ్ చేతిలో ఉంది

శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం గుజరాత్ లోని సూరత్ లోని హోటల్ లో ఉంటున్నారు. అయితే శివసేన పార్టీ బలం 33కు పడిపోయింది. రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలు అందరూ సామూహిక రాజీనామాలు చేస్తే పరిస్థితి మరోరకంగా మారిపోయే అవకాశం ఉంది.

అప్పుడు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వ బలం 130కి పడిపోతుంది. అప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 265కు పడిపోతుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే 133 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతోంది.

సీఎం అనుచరులు అలర్ట్

సీఎం అనుచరులు అలర్ట్

మహారాష్ట్ర రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్న ఎమ్మెల్యేలు చెయ్యిజారిపోకుండా ఉద్దవ్ ఠాక్రే అనుచరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోకుండా ఉండటానికి ఉద్దవ్ ఠాక్రే అనే చర్యలు తీసుకుంటున్నారు.

English summary
CM Seat: 288 Assembly constituencies of Maharashtra, BJP secured 106 seats, Shiv Sena 56, Congress 44 and the Nationalist Congress Party 54.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X