దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ మునుపెన్నడూ లేని విధంగా రెక్కలు విప్పాయి. ఈరోజు 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధరపై రూ.294 పెరగడంతో గ్రాము ధర రూ.14,858 మార్కుకు చేరింది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.270 పెరిగి రూ.13,620 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై రూ.221 ఎగబాకి రూ.11,144 కి చేరుకుంది.
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారి కోసం చూస్తే.. 100 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఏకంగా రూ.29,400 మేర పెరిగి రూ.14,85,800 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ 100 గ్రాములపై రూ.27,000 పెరిగి రూ.13,62,000 గాను, 18 క్యారెట్ల బంగారం 100 గ్రాములపై రూ.22,100 పెరిగి రూ.11,14,400 గాను ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.2,940 మేర భారీగా పెరిగి రూ.1,48,580 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.2,700 జంప్ చేసి రూ.1,36,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధరపై రూ.2,210 పెరగడంతో రూ.1,11,440 గా నమోదైంది.

దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో పసిడి రేట్లు:
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో పసిడి రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,50,550 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,000 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.1,15,500 వద్ద విక్రయించబడుతోంది.
ముంబై, బెంగళూరు, కోల్కతా: ఈ మూడు నగరాల్లోనూ తెలుగు రాష్ట్రాల తరహాలోనే ధరలు నమోదయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,48,580 గాను, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,200 గాను మరియు 18 క్యారెట్ల బంగారం రూ.1,11,440 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఢిల్లీ: దేశ రాజధానిలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,820 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,36,350, 18 క్యారెట్ల బంగారం రూ.1,11,530 గా ఉంది.
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,630 వద్ద, 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,36,250 వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,490 వద్ద ట్రేడ్ అవుతోంది.
కేజీ వెండిపై ఏకంగా రూ.9,000 పెరగుదల!
బంగారంతో పోటీ పడుతూ తెల్ల బంగారం (వెండి) సైతం సామాన్యులకు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే కిలో వెండి ధరపై దాదాపు రూ.9,000 మేర భారీ పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2.49 లక్షల మార్కును తాకింది. కాగా, స్థానిక మార్కెట్లలోని మరికొన్ని ప్రాంతాల్లో గ్రాముపై రూ.5 చొప్పున పెరిగి కిలో వెండి ఏకంగా రూ.2,65,000 వరకు కూడా పలుకుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ అదే జోరు
గ్లోబల్ మార్కెట్లోనూ పసిడి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. నేడు అంతర్జాతీయ విపణిలో ఔన్సు పుత్తడి ధర ఏకంగా 4,205 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే అంతర్జాతీయంగానూ 100 డాలర్ల పైనే పెరగడం గమనార్హం. అలాగే ఔన్సు వెండి ధర 67.32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇటు దేశీయంగా మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX) లోనూ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1.50 లక్షల మార్కు వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ.2.43 లక్షల వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లలో హాట్ టాపిక్గా మారాయి.














Click it and Unblock the Notifications