ఏపీలో కూటమికి రెండేళ్ళు.. తిరుపతిలో భారీ సభ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ రిపోర్ట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ విజయవంతమైన రెండేళ్ల పాలనను పురస్కరించుకుని ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో జూన్ 12 ఒక భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టింది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" అనే ప్రధాన నినాదంతో ఏర్పాటు చేసిన ఈ వేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు బీజేపీకి చెందిన అగ్రనేతలు ఉమ్మడిగా హాజరుకానున్నారు.

కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి ప్రజల వద్దకు

గత 24 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన మైలురాళ్లు, ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఈ సభ ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నారు.
ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పునరుద్ధరణ, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షించడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది.

cm chandrababu gives progress report on AP NDA Govt 2 Years Celebration Grand Public Meeting in Tirupati

భవిష్యత్ ప్రణాళికలను చెప్పే ప్లాన్

సంక్షేమాన్ని, ఆర్థికాభివృద్ధిని సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్నామని చాటిచెప్పేలా తమ 'ప్రోగ్రెస్ రిపోర్ట్ 'ను ఈ సభలో బహిర్గతం చేయనున్నారు. అంతేకాకుండా, రాబోయే మూడేళ్ల కాలంలో ఏపీని ప్రగతిపథంలో నడిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటు సీఎం, అటు డిప్యూటీ సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం తిరుపతి పరిధిలో సుమారు 20 ఎకరాల సువిశాల స్థలంలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ప్రత్యేక స్టాల్స్... 30 వేల మందికి పైగా కూటమి శ్రేణులు

పాలనాపరమైన సంస్కరణలు, వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును మరియు లబ్ధిదారుల విజయగాథలను డిజిటల్ రూపంలో ప్రదర్శించేందుకు వీలుగా ఇక్కడ 20 ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.రాష్ట్రంలోని నలుమూలల నుండి దాదాపు 30 వేల మందికి పైగా కూటమి శ్రేణులు, సాధారణ ప్రజలు తరలివస్తారనే అంచనాతో అధికారులు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

సభకు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపులు

జిల్లా కలెక్టర్, ఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణలో సుమారు రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. మరోవైపు, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చిత్తూరు, కడప, నెల్లూరు, చెన్నై తదితర మార్గాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు విధించారు.

సూపర్ న్యూస్.. రూ.300కోట్లతో అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్!
సూపర్ న్యూస్.. రూ.300కోట్లతో అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్!

ఆ నగరాల్లోనూ ప్రగతి సభలకు ప్లాన్

కాగా, ఈ తిరుపతి సభ విజయవంతం అయిన అనంతరం అమరావతి, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇలాంటి భారీ ప్రగతి సభలను నిర్వహించేందుకు కూటమి నాయకత్వం యోచిస్తోంది. తమ పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధిని, భవిష్యత్ లో సాధించబోయే ప్రగతిని ప్రజల ముందు సగర్వంగా ఉంచనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+