ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర కాషాయ కూటమిదే: కాంగ్రెస్-ఎన్సీపీలకు భారీ ఓటమి తప్పనట్టే
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమి మరోసారి నిరాశ తప్పదని, ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోందని వెల్లడించాయి. 288 స్థానాల సంఖ్యాబలం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ముప్పావు భాగం సీట్లను బీజేపీ-శివసేన కూటమి కైవసం చేసుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ తేటతెల్లం చేశాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించిన దాదాపు అన్ని జాతీయ ఛానెళ్లు కూడా బీజేపీ-శివసేన కూటమే అధికారంలోకి వస్తాయని వెల్లడించాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 141, శివసేన 102 స్థానాలను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోందని పేర్కొన్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కేవలం 17 స్థానాలకే పరిమితమౌతుందని సీఎన్ఎన్ న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ ఛానెల్ తన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది.

హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సారథ్యం వహిస్తోన్న అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఒక స్థానాలో విజయం సాధిస్తుందని సీఎన్ఎన్ న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ అంచనా వేసింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెల్లడి కానున్న విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ లోనూ దాదాపు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడింది. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ-శివసేన కూటమి ఓట్ల శాతం గానీ, సీట్ల సంఖ్య గానీ భారీగా పెరుగుతాయని వెల్లడించింది. గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు భారీగా నష్టపోతాయని ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications