ప్రియుడిని కట్టేసి.. విద్యార్థినిపై ఒకరి తర్వాత ఒకరు రేప్
బెంగళూరు/చెన్నై: కర్నాటక - తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావేరి పట్టణానికి చెందిన ఓ ఇరవై రెండేళ్ల విద్యార్థిని పైన నలుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కృష్ణగిరిలోని కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి ెచందిన ఓ యువకుడిని ప్రేమించింది.
ఇద్దరూ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరు కులాలు వేరు కావడంతో ఇరువైపుల కుటుంబాలు ఈ పెళ్లిని వ్యతిరేకించాయి. ఈ క్రమంలో వివాహం చేసుకునేందుకు వారు కృష్ణగిరి నుండి శుక్రవారం సాయంత్రం కారులో బయలుదేరారు. దారి మధ్యలో కారు ఆపిన సమయంలో.. అక్కడే ఉన్న నలుగురు దుండగులు ఆ ఇద్దరి పైన దాడికి దిగారు.
మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు ఆమెను నిర్బంధించారు. ప్రియుడి కాళ్లు, చేతులు తాడుతో కట్టివేశారు. ఆమెను తీసుకు వెళ్లి వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. పలువురి సాయంతో బాధితులు బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.