పాకిస్తాన్కు షాక్: మాకు స్వేచ్ఛ కావాలని పీవోకేలో విద్యార్థుల ధర్నా
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులోని ఓ కాలేజీలో విద్యార్థులు తమకు స్వాతంత్ర్యం కావాలంటూ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరనసలు, ఆందోళనలు చేపట్టారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులోని ఓ కాలేజీలో విద్యార్థులు తమకు స్వాతంత్ర్యం కావాలంటూ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరనసలు, ఆందోళనలు చేపట్టారు.
ఆ విద్యార్థులు పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. తమకు స్వేచ్ఛ కావాలని రోడ్డెక్కుతున్నారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని హజరియా కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కష్టాలు వెన్నంటుతున్నాయి. సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా షరీఫ్ మాట్లాడుతున్నారంటూ ఆయనకు వ్యతిరేకంగా రావల్పిండిలో ఓ కేసు నమోదైంది.
ఇష్తియాక్ అహ్మద్ మిర్జా అనే లాయర్ ఈ కేసు పెట్టాడు. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా షరీఫ్ మాట్లాడుతున్న ఓ వీడియో తనకు వాట్సప్ మెసేజ్ ద్వారా వచ్చిందని, దేశ ద్రోహానికి పాల్పడ్డ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు.