Maharastra Eletions: రెడ్ బుక్ వాడుతున్న రాహుల్ గాంధీ -మహా ఎన్నికల్లో కలకలం..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖాముఖీ తలపడుతున్న మహా వికాస్ అఘాడీ, మహాయుతి కూటముల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న తరుణంలో నేతలు మాటల దాడిని తీవ్రం చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన రెడ్ బుక్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వీటిని కాంగ్రెస్ ఖండించింది.
తాజాగా నాగ్ పూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్స్ సాయం కోరారని దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపణలు చేశారు. అర్బన్ నక్సల్స్ నుంచి సాయం తీసుకునేందుకు రాహుల్ గాంధీ రెడ్ బుక్ వాడుతున్నారంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ చేతిలో తాజాగా కనిపిస్తున్న ఎర్ర పుస్తకాన్ని ఉద్దేశించి ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేసారు. వాస్తవానికి కమ్యూనిస్టుల రంగు అయిన ఎరుపు రంగుతో ఉన్న పుస్తకంతో కనిపించిన రాహుల్ .. అర్బన్ నక్సల్స్ కోసమే ఇలా చేస్తున్నారంటూ ఫడ్నవీస్ ఆరోపిస్తున్నారు.

ఫడ్నవీస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ఆయన అవమానిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఫడ్నవీస్ చెబుతున్న రెడ్ బుక్ భారత రాజ్యాంగ మని, దానిపై విమర్శలు చేయడం ద్వారా అంబేద్కర్ ను ఆయన అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. 1949లో మనుస్మృతి నుండి ప్రేరణ పొందిన ఆరెస్సెస్ దాడి చేసిన అదే భారత రాజ్యాంగం అంటూ వ్యాఖ్యానించారు. తద్వారా












Click it and Unblock the Notifications