కాంగ్రెస్ అసోంను విడదీసింది.. బీజేపీ మాత్రం కలిపింది: ప్రధాని మోడీ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నేతల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అసోంను కాంగ్రెస్ పార్టీ వీడదీసిందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు.. ఇవాళ ఆయన కరీమ్ గంజ్ జిల్లా భాట్గ్రామ్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అన్నీ విభాగాలుగా కాంగ్రెస్ పార్టీ విడదీసిందని తెలిపారు. కానీ బీజేపీ మాత్రం అందరినీ కలిపిందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఫిజికల్గా.. సాంస్కృతికంగా కలుపుతున్నామని మోడీ వివరించారు.
బెంగాల్ లో దీదీ ఆట ముగిసింది , ఇది అభివృద్ధికి సమయం : విరుచుకుపడిన ప్రధాని మోడీ
2016లో అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అంతకుముందు 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని వివరించారు. ఏ కాంగ్రెస్ నేత.. విధానాలు, సరిగా పనిచేయలేవని.. అందుకోసమే స్థిరమైన ప్రభుత్వం కొనసాగలేదని వివరించారు. క్షేత్రస్థాయిలో నష్టం జరిగిందని.. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కారణం అని వివరించారు. కానీ బీజేపీలో అలా ఉండదని పేర్కొన్నారు. బెంగాల్లో కాంగ్రెస్, లెప్ట్ కలిసి పోటీ చేస్తున్నాయని మోడీ తెలిపారు. కానీ అవే పార్టీలు కేరళలో ప్రతిపక్షంగా పోటీ చేస్తున్నాయని వివరించారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అని మోడీ చెప్పారు. అలా బెంగాల్లో కలిసి పోటీ చేసి.. మరో చోట ప్రత్యర్థులుగా ఉంటారా అని అడిగారు. ఏ రాజకీయ పార్టీ ఎలా స్థిరత్వం ఉండబోదు అని అడిగారు.