ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీకి భారీ ఊరట- మోదాని మోడల్
పీఎన్బీలో వేల కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీకి ఊరట లభించింది. రెడ్ కార్నర్ నోటీస్ నుంచి ఆయన పేరును ఇంటర్ పోల్ తొలగించింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటోన్నాయి.
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీకి భారీ ఊరట లభించింది. ఇదివరకు ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ నుంచి ఆయన పేరును తొలగించింది. దేశం విడిచి పారిపోయిన ఓ నేరస్తుడు ప్రపంచంలో మరెక్కడికీ ప్రయాణించడానికి వీల్లేకుండా ఇంటర్ పోల్ జారీ చేసే- రెడ్ కార్నర్ నోటీస్ ఇది.
ఈ నోటీసుల జాబితాలో నుంచి మేహుల్ చోక్సీ పేరును ఇంటర్ పోల్ తొలగించింది. దీనితో ఆయన ఎక్కడికైనా రాకపోకలు సాగించే వీలు కలిగినట్టయింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే ఇంటర్ పోల్- ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని బలపరిచేలా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తోన్నాయి. కేంద్రం అభ్యర్థన మేరకే మేహుల్ చోక్సీపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ ను ఇంటర్ పోల్ తొలగించిందని విమర్శిస్తోన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 13,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసానికి పాల్పడిన మేహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి కరేబియన్ ద్వీపదేశం అంటిగ్వా అండ్ బార్బుడాలో నివసిస్తోన్నారు. 2017లో వారికి ఆ దేశ పౌరసత్వం కూడా లభించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉండటం వల్ల మేహుల్ చోక్సీని భారత్కు తీసుకుని రావడానికి సీబీఐ, ఈడీ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు.
తాజాగా- ఇంటర్ పోల్ తీసుకున్న నిర్ణయంతో మేహుల్ చోక్సీ ఇక ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా రాకపోకలు సాగించే వీలు ఏర్పడినట్టయింది. అరెస్ట్ చేస్తారనే కారణంతో భారత్ కు రాలేకపోవచ్చు. ఇదివరకు కిడ్నాప్ అయినట్లు భావించిన మేహుల్ చోక్సీ డొమినికాలో తేలారు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో ఆయనకు జైలుశిక్ష విధించిందా దేశం. రెడ్ కార్నర్ నోటీస్ తొలగిపోయిన నేపథ్యంలో ఇప్పుడలాంటి పరిస్థితులను చోక్సీ ఎదుర్కొనకపోవచ్చు.
ఈ వ్యవహారం పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇదంతా మోదీ ప్లస్ అదాని మోదాని మోడల్ లో భాగమేనంటూ ధ్వజమెత్తుతున్నాయి. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలను ఇష్టానుసారంగా ప్రయోగిస్తోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం- ఆర్థిక నేరస్తులను మాత్రం స్వేచ్ఛగా వదిలిపెడుతోందంటూ భగ్గుమంటోన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సహా పలువురు విపక్ష నాయకులు దీన్ని తప్పుపడుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications