సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్ధుల ముందంజ
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. సెంట్రల్ కర్ణాటక రాష్ట్రంలో బిజెపి అభ్యర్ధులు కాంగ్రెస్ పార్టీ కంటే ముందంజలో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ఆధారంగా సెంట్రల్ కర్ణాటక పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి అభ్యర్ధులు తమ సమీప ప్రత్యర్ధుల కంటే ముందంజలో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎక్కువగా బెంగుళూరులో ఆధిక్యంలో ఉన్నారు. దక్షిణ కర్ణాటకలో జెడి(ఎస్) అభ్యర్ధుల హవా కొనసాగుతోంది ప్రస్తుతం బిజెపి కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ కన్పిస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్నికల ఫలితాలపై రాజకీయ పరిశీలకులతో పాటు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడుతారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
దక్షిణాదిలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బిజెపి, అధికారాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య జెడి(ఎస్) కింగ్ మేకర్ గా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.