Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus: 24 గంటల్లో 69 వేల మందికి కరోనా, ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బకు, దేవుడా!

న్యూఢిల్లీ/ బెంగళూరు/ ముంబాయి/ చెన్నై: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి తాండవం చేస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 69, 921 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దేశంలో మంగళవారం రాత్రి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36, 91, 116కు చేరుకుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కాటుకు 819 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భారతదేశంలో ఇప్పటి వరకు 65, 288 మంది కరోనా కాటుకు బలి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బతో ఇంకా ఎన్ని కేసులు పెరిగిపోతాయో ? అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

7.85 లక్షల యాక్టివ్ కేసులు

7.85 లక్షల యాక్టివ్ కేసులు

భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారినపడి 28, 39, 882 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 7, 85, 996 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశంలో ఇప్పటి వరకు 21. 29 % యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

పెరుగుతున్న రికవరీ రేటు

పెరుగుతున్న రికవరీ రేటు

దేశంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోందని, మంగళవారానికి రికవరీ రేటు 76.94 % పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో క్రమంగా కరోనా మరణాల రేటు కూడా తగ్గుతోందని, ప్రస్తుతం మరణాల రేటు 1.77 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

వారంలో 5 లక్షల కరోనా కేసులు

వారంలో 5 లక్షల కరోనా కేసులు

భారతదేశంలో ఎన్నడూ లేనివిధంగా గత వారం రోజుల్లో ఐదు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఆగస్టు 31వ తేదీ వరకు 4, 33, 24, 834 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎంఆర్ తెలిపింది. ఒక్క సోమవారం రోజు మాత్రమే 10, 16, 920 శాంపిళ్లు పరీక్షించామని ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో మొత్తం 1, 583 ల్యాబుల్లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.

రెండు వారాల్లో 1.22 కోట్ల పరీక్షలు

రెండు వారాల్లో 1.22 కోట్ల పరీక్షలు

గత రెండు వారాల్లో భారతదేశంలో మొత్తం 1. 22 కోట్ల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నిర్దారణ పరీక్షల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రమే 34 % పరీక్షలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే 34 శాతం కరోనా పరీక్షలు నిర్వహించడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. దేశంలో ప్రతి మిలియన్ జనాభాలో 31, 394 కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Recommended Video

    NSUI Demands Telangana Govt To Postpone Entrance Exams
    ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బకు?

    ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బకు?

    లాక్ డౌన్ నియమాలు అమల్లో ఉన్న సమయంలో కరోనా పాజిటివ్ కేసులు ఈ విధంగా నమోదు అవుతుంటే ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లు, ప్రైవేటు బస్సుల సంచారానికి అనుమతి ఇచ్చారని, ఇక ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తే ఇక ముందుముందు ఏవిధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతాయో ? అనే భయంగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద భారతదేశంలో ఒక్క రోజులోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో 69, 921 నమోదు కావడంతో ప్రజలు హడలిపోయారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+