Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

shocking : నీటిలో కరోనా వైరస్ ... సబర్మతి నదితో పాటు మరో రెండు సరస్సులలో కనుగొన్న పరిశోధకులు

భారతదేశంలో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నీటిలో కూడా కరోనా వైరస్ జాతులు ఉన్నాయని గాంధీనగర్ ఐఐటి, మరియు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం యొక్క స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ పరిశోధకులు తేల్చారు. నీళ్ళల్లో కరోనా వైరస్ చాలా కాలం జీవించి ఉంటుందని కూడా పరిశోధకులు తేల్చారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నదులు, చెరువులు, త్రాగునీరు తదితరాలలో కూడా వైరస్ ఉంటుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

సబర్మతి నది నీటి నమూనాలలో కరోనా వైరస్

సబర్మతి నది నీటి నమూనాలలో కరోనా వైరస్

అహ్మదాబాద్లోని సబర్మతి నది నుండి తీసిన నీటి నమూనాలలో కరోనావైరస్ యొక్క జాతులు కనుగొనబడ్డాయి. నగరంలోని కాంక్రియా మరియు చందోలా సరస్సుల నుండి తీసిన నమూనాలలో కూడా ఈ వైరస్ కనుగొనబడిందని వారు పేర్కొన్నారు. ఐఐటి, గాంధీనగర్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం యొక్క స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ సైన్స్ పరిశోధకులు సబర్మతి నది మరియు చందోలా మరియు కాంక్రియా సరస్సుల నుండి నమూనాలను సేకరించి వాటిపై పరిశోధనలు జరిపారు.

సరస్సులు, నదుల్లో కరోనా వైరస్ ఉండటం ప్రమాదకరమైన స్థితికి దారి తీస్తుంది

సరస్సులు, నదుల్లో కరోనా వైరస్ ఉండటం ప్రమాదకరమైన స్థితికి దారి తీస్తుంది

సరస్సులు మరియు నదులలో కరోనా వైరస్ ఉండటం ప్రమాదకరమైన స్థితికి దారితీస్తుందని గాంధీనగర్ ఐఐటిలోని ఎర్త్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ మనీష్ కుమార్ అన్నారు. ప్రొఫెసర్ మనీష్ కుమార్ వారు సెప్టెంబర్ 3 మరియు డిసెంబర్ 29, 2019 మధ్య వారానికి ఒకసారి నీటి నమూనాలను సేకరించారని చెప్పారు. సబర్మతి నది నుండి 694 నమూనాలను సేకరించగా, 549 నమూనాలను చందోలా సరస్సు నుండి మరియు 402 నమూనాలను కంక్రియా సరస్సు నుండి తీసుకున్నామని చెప్పారు.

గతంలో మురుగు నీటిలోనూ కరోనా వైరస్ ఉన్నట్టు అధ్యయనం

గతంలో మురుగు నీటిలోనూ కరోనా వైరస్ ఉన్నట్టు అధ్యయనం

ఇలాంటి పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని పరిశోధకులు కోరుతున్నారు. వైరస్ సహజ నీటిలో చాలా కాలం జీవించగలదని వారు చెప్పారు. భారతదేశంలో, సంభావ్య కోవిడ్ -19 క్లస్టర్‌లను గుర్తించడానికి ఈ వారం ప్రారంభంలో బెంగళూరులో నగర మురుగునీటి నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. గతంలో మురుగునీటిలో కరోనావైరస్ ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గాంధీనగర్ (ఐఐటి-జిఎన్) ఒక రీసెర్చ్ లో కనుగొంది. శుద్ధి చేయని మురుగునీటి నుండి సేకరించిన వ్యర్థజలాల నమూనాలలో కరోనావైరస్ యొక్క జన్యువులను కనుగొన్నారు . అయితే ఇది వ్యాప్తికి కారణం మాత్రం కాదని తేల్చింది .

Recommended Video

    Vaccination Boost Natural Immunity దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో | COVID 19 Study || Oneindia Telugu
    నీటిలో ఉన్న వైరస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో అధ్యయనం

    నీటిలో ఉన్న వైరస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో అధ్యయనం

    అంతకుముందు, ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ లోని గంగా నదిలో కోవిడ్ -19 సోకిన వ్యక్తుల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. 100 కు పైగా మృతదేహాలను నదిలో పారవేసినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గంగానదిలో కూడా కరోనా వైరస్ ఉండే అవకాశం లేకపోలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ఈ నీటిలో ఉన్న కరోనా వైరస్ ఏ మేరకు మానవులపై ప్రభావం చూపిస్తుంది అనేది మాత్రం పరిశోధించాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+