పెప్సీ, కోకాకోలాలు నీరు వాడుకోవచ్చు: తీర్పుపై తమిళుల నిరసన
శీతల పానీయాలైన పెప్సీ, కోక్లకు మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. వాటికి నీటి సరఫరా నిలిపివేయాలని వేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ కొట్టేసింది.
చెన్నై: శీతల పానీయాలైన పెప్సీ, కోక్లకు మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. వాటికి నీటి సరఫరా నిలిపివేయాలని వేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ కొట్టేసింది.
తమిరబరని నది నుంచి పెప్సీ, కోక్ కంపెనీలు నీటిని వాడుకోవద్దని పిటిషన్ దాఖలు కాగా.. కోర్టు దానిని తిరస్కరించింది. గత నవంబర్ నెలలో కోర్టు ఈ రెండు కంపెనీలు తమిరబరని నది నుంచి నీరు తీసుకోవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

అయితే తాజా పిటిషన్ను మాత్రం కోర్టు కొట్టేసింది. తిరునల్వేలి జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం సెక్రటరీ డీఏ ప్రభాకర్ ఈ రెండు కంపెనీలకు తమిరబరని నీటి సరఫరాను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా, ఈ తీర్పు పైన పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నదిలో మోకాలి లోతు వరకు దిగి నిరసన తెలుపుతున్నారు. తమిరభరని నది నుంచి నీటిని తీసుకోవచ్చన్న హైకోర్టు ఉత్తర్వులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీక్ష నిర్వహించారు.
సాగు నీటి కొరత వేధిస్తున్నప్పటికీ ఈ కేసులో తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications