కులాల బదిలీ: యోగి ఆదిత్యనాథ్కు హైకోర్టులో చుక్కెదురు
లక్నో: 17 ఓబీసీ, ఇతర వెనుకబడిన తరగతులను షెడ్యూల్డ్ క్యాస్ట్స్లో చేర్చాలని నిర్ణయించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు.
గోరఖ్ ప్రసాద్ అనే కార్యకర్త వేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కశ్యప్, రాజ్భర్, ధివర్, బింద్, కుమ్హర్, కహర్, కెవత్, నిషద్, భవర్, మల్లహ్, ప్రజాపతి, ధిమర్, బథమ్, తుర్హ, గోడియా, మాంఝీ, మచువా లాంటి ఓబీసీ వర్గాలను షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేరుస్తున్నట్లు యూపీ బీజేపీ ప్రభుత్వం జూన్ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్వులు వెలువడిన మరుసటి రోజు నుంచే అమలు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రతిపక్షాలతోపాటు కొందరు సొంత పార్టీ నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, 2022లో జరగనున్న ఎన్నికల్లో గెలిచే ఉద్దేశంతోనే యోగి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు ప్రతిపక్షాల నేతలు.
కాగా, యోగి ప్రభుత్వం అమలు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధమని అతని సొంత పార్టీ బీజేపీ నేత, కేంద్రమంత్రి అశోక్ గెహ్లట్ పార్లమెంటులోనే వ్యతిరేకించారు. ఇది సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. అయితే, యోగి కంటే ముందే 2005లో ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం 11 వెనుకబడిన కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications