జనవరి చివరికి ఓమిక్రాన్ సునామీ- రోజుకు 10 లక్షల కేసులు-తాజా అంచనాలు
భారత్ లో కోవిడ్ 19 కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంట్లలో నమోదైన లక్షకు పైగా కేసులు ఏడు నెలల గరిష్టం కాగా.... ఈ సంఖ్య మరో 20 రోజుల్లోనే రోజుకు పది లక్షలకు చేరబోతోందని తాజా అంచనాలు చెప్తున్నాయి. దీంతో ఈ నెలాఖరు కల్లా కోవిడ్ ధర్డ్ వేవ్ పీక్ కు చేరబోతోందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య మరింత భారీగా పెరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఓమిక్రాన్ కేసులతో కూడిన ఈ ధర్డ్ వేవ్ భారత్ లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఓమిక్రాన్ సునామీ
భారత్ లో కోవిడ్ ముప్పు ఓమిక్రాన్ వైరస్ రూపంలో ముంచుకొస్తోంది. ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ వైరస్ కేసులు నమోదవుతుండగా.. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వీటి పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూలు, పగటి పూట ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. పరిస్ధితి మరింత విషమిస్తే లాక్ డౌన్ లు విధించేందుకు సైతం ఆయా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. భారత్ లో పెరుగుతున్న ఓమిక్రాన్ వైరస్ కేసులకు తోడు డెల్టా వేరియంట్ లతో పాటు ఇతర వేరియంట్లు కూడా విరుచుకుపడుతున్నాయి.

ఏడునెలల గరిష్టానికి కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంట్లలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గతంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ స్ధాయిలో కేసులు నమోదు కాగా.. మరోసారి అలాంటి పరిస్ధితే కనిపిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా సాగుతోంది. దీంతో మిగతా కేసులతో కలిపి ఈ కేసులు కూడా ఎక్కువై కోవిడ్ ధర్డ్ వేవ్ భయాల్ని మరింత పెంచేస్తున్నాయి. రోజుకు కనీసం 20 నుంచి 30 వేల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ లెక్కల త్వరలో కరోనా ధర్డ్ వేవ్ పీక్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

నెలాఖరుకు రోజుకు 10 లక్షలు
ఈ నెలాఖరు నాటికి ఓమిక్రాన్ వైరస్ తో కూడిన కరోనా కేసుల సంఖ్య రోజుకు 10 లక్షలు నమోదు కావచ్చన్న అంచనాలు దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పరిశోధన సంస్ధ ఐఐఎస్సీ-ఐఎస్ఐ తాజా నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం ప్రకారం ఈ నెలాఖరుకు కరోనా ధర్డ్ వేవ్ పీక్ లో ఉంటుందని, రోజుకు 10 లక్షల కేసులు నమోదు కావడం ఖాయమని అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా చెబుతోంది. ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ పరిశోధనలోనూ ఇదే విషయం వెల్లడైంది. దీంతో ఈ నెలాఖరుకు కరోనా ధర్డ్ వేవ్ పీక్ కు చేరడం ఖాయమని తేలిపోయింది.

పతాకస్ధాయికి ధర్డ్ వేవ్
భారతదేశంలో కరోనావైరస్ ధర్డ్ వేవ్ గరిష్ట స్థాయి జనవరి చివరి వారం నుంచి మొదలై ఫిబ్రవరి తొలి రెండు వారాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలు వేర్వేరు స్ధాయిలు కలిగి ఉంటాయని కూడా తాజా నివేదికలు చెప్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో మూడవ వేవ్ యొక్క గరిష్ట స్థాయి జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు మారుతూ ఉంటుందని తెలుస్తోంది. భారతదేశానికి కోవిడ్-19 ధర్డ్ వేవ్ తగ్గుదల మార్చి-ప్రారంభం నాటికి ఉండే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ తెరపైకి ఆ కోవిడ్ మోడల్..! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!











Click it and Unblock the Notifications