హిమాచల్లో కాంగ్రెస్కు షాక్: మెజార్టీ ఉన్నా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే నెగ్గారు!
సిమ్లా: నేడు విడుదలైన రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో అంతా ఊహించినట్లే క్రాస్ ఓటింగ్ ప్రభావం చూపింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలు పార్టీలకు క్రాస్ ఓటింగ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రాగా.. కర్ణాటకలోమాత్రం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరగ్గా.. బీజేపీ 8 మంది అభ్యర్థులను బరిలో దింపింది. సమాజ్ వాదీ పార్టీ ముగ్గురిని నిలిపింది. అయితే, ఏడుగురు సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలిసింది. దీంతో బీజేపీ పోటీ చేసిన 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు రాజ్యసభ స్థానాలు వచ్చాయి.

ఇక హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ.. అక్కడ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ సింఘ్వీకి ఎదురుదెబ్బ తగిలింది.
68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి 34 ఓట్లు లభించగా.. పార్టీకి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 40 మంది కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు వేస్తే సింఘ్వీ గెలిచేవారే కానీ.. క్రాస్ ఓటు వేయడంతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై మండిపడుతున్నారు.
రాష్ట్రంలో రాజ్యసభ సీటును గెలుచుకునే సంఖ్య ఉన్నప్పటికీ.. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు - ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు - బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది. ఇప్పుడు, కాంగ్రెస్కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థి హర్ష్ మహాజన్కు ఓటు వేస్తే.. ఇద్దరు అభ్యర్థులకు ఒక్కొక్కరికి 34 ఓట్లు వచ్చాయి, ఇది టైకు దారితీసింది.
ఈ క్రమంలో టై బ్రేకర్గా చాలా అరుదుగా అవసరమయ్యే ప్రత్యేకమైన ఎక్సర్సైజ్, డ్రా ఆఫ్ లాట్లో మహాజన్ గెలిచారు. నిబంధనల ప్రకారం, రాజ్యసభలో టైని బ్రేక్ చేయడానికి లాట్ల 'పర్చా' విధానం ఉపయోగించబడుతుంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపునకు తిప్పుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి పడటంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన మెజార్టీ లేదని బీజేపీ నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications