బలపరీక్ష రోజు ఇదీ జరిగింది!: గవర్నర్కు రిపోర్ట్, జయ కుర్చీలో పళని
తమిళనాడు శాసన సభలో పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా జరిగిన ఆందోలనకర పరిణామాలపై శాసన సభ కార్యదర్శి జమాలుద్దీన్.. రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు నివేదిక అందించారు.
బెంగళూరు: తమిళనాడు శాసన సభలో పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా జరిగిన ఆందోలనకర పరిణామాలపై శాసన సభ కార్యదర్శి జమాలుద్దీన్.. రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు నివేదిక అందించారు.
శనివారం నాడు తమిళ శాసన సభలో ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణలో నెగ్గిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఉద్హిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ జరిగిన తీరుపై విపక్షాలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయి.
ఆయన నివేదిక అఢిగారు. ఈ నేపథ్యంలో సభలో చోటుచేసుకున్న పరిణామాలను జమాలుద్దీన్ నివేదిక ఇచ్చారు. పళనిస్వామి బలపరీక్ష చెల్లదని డీఎంకే నాయకులు స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు.

శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలపై నివేదిక సమర్పించాల్సిందిగా శాసనసభ కార్యదర్శి జమాలుద్దీన్ను గవర్నర్ ఆదేశించారు. సభ ఉదయం నుంచి మొదలైనప్పటి నుంచి నిరవధికంగా వాయిదా పడిన వరకు జరిగిన మొత్తం ప్రక్రియపై పత్రాలు, వీడియో దృశ్యాలతో ఆధార సహితంగా నివేదిక ఇవ్వాలని సూచించారు.
జయలలిత కుర్చీలో..
ముఖ్యమంత్రి పళనిస్వామి పూర్తిస్థాయిలో పాలన మీద దృష్టి సారించారు. అయిదు నెలల తర్వాత తొలిసారి జయలలిత కార్యాలయానికి వెళ్లి ఆమె వాడిన కూర్చీలో కూర్చున్నారు. జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆ కుర్చీలో ఎవరూ కూర్చోలేదు.
పన్నీర్ ముఖ్యమంత్రి అయినా జయ మీదున్న గౌరవంతో ఆ కార్యాలయానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు పళనిస్వామి మాత్రం నేరుగా కార్యాలయానికి వెళ్లి, జయ కుర్చీలో కూర్చొని, కొన్ని ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు. అయితే, బాధ్యతలను స్వీకరించే సమయంలో మాత్రం జయలలిత ఫొటోను టేబుల్ పైన పెట్టుకున్నారు.
పళనిస్వామి సోమవారం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తొలుత మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన ఆయన సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ ఆయనకు స్వాగతం పలికారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రాష్ట్ర మంత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. పళనిస్వామి అయిదు ఫైళ్ల పైన సంతకాలు చేశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications