వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తౌక్తే తుపాను బీభత్సం: కొవిడ్ ఆస్పత్రుల్లో పవర్ కట్స్ -సీఎంలకు అమిత్ షా నిర్దేశం -కర్ణాటకలో నలుగురు మృతి

|
Google Oneindia TeluguNews

అరేబియా తీరాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో తౌక్తే తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో పరిస్థితి గంటగంటకూ మారుతున్నది. ఈ నెల 18న ఉదయం గుజరాత్‌ వద్ద తీరం దాటుతుందని భావిస్తోన్న తౌక్తే తుపాను ప్రస్తుతం పంజిమ్‌-గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్లు, ముంబై 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైఉంది. తీరం దాటడానికి ముందే తీవ్ర ప్రభావం చూపెడుతోంది..

తౌక్తే తుపాను ధాటికి కర్ణాటక తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్‌లో భారీ వర్షపాతం నమోదైందని, వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) ఆదివారం తెలిపింది. తుపానుకు 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని, ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారని తెలిపారు.

ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలుఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

 Cyclone Tauktae: 4 dead in Karnataka, power cuts in Goas covid hospital, Maha CM with Amit Shah

గోవా తీర ప్రాంతాలు, రాజధాని పనాజీని తౌక్తే అతలాకుతలం చేస్తున్నది. తుపాను దాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోగా చాలా చోట్ల కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పనాజీలోని ఓ ఆస్పత్రి ఆవరణలో చెట్లు కూలడంతో కొవిడ రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పారు.

కరోనాతో మరో ఎంపీ మృతి -ప్రధాని మోదీ దిగ్భ్రాంతి -రాజీవ్ సతావ్ మరణం తీరని లోటన్న రాహుల్ గాంధీకరోనాతో మరో ఎంపీ మృతి -ప్రధాని మోదీ దిగ్భ్రాంతి -రాజీవ్ సతావ్ మరణం తీరని లోటన్న రాహుల్ గాంధీ

తౌక్తే తుపాను బీభత్సం నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కీలక సమీక్షలు నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలతో షా కాన్ఫరెన్స్ నిర్వహించారు. విలయాన్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని, కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయం అందజేస్తామని షా పేర్కొన్నారు.

English summary
as Cyclonic storm Tauktae has intensified into a “very severe" cyclonic storm, several states at high alert. According to the Karnataka State Disaster Managagement Authority (KSDMA), four people have lost their lives and 73 villages have been affected by cyclone Tauktae. Union Home Minister Amit Shah on sunday discuss Maharashtra’s preparedness for cyclone Tauktae with Chief Minister Uddhav Thackeray. power supply cut in Goa's GMC treating Covid patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X