చిక్కుల్లో శశికళ ఫ్యామిలీ: ఆదాయ పన్ను చెల్లించారా ? లేదంటే జైలే గతి!
చెన్నై/బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు కోర్టు విధించిన రూ. 30 కోట్ల అపరాద రుసుం ఏ మార్గంలో చెల్లించాలని వారి కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జయలలితకు రూ. 100 కోట్లు, శశికళకు రూ. 10 కోట్లు, ఇళవరసికి రూ. 10 కోట్లు, సుధాకరన్ కు రూ. 10 కోట్లు చొప్పున సుప్రీం కోర్టు అపరాద రుసుం విధించింది. జయలలిత ఆస్తులు అమ్మి తమిళనాడు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు పలు కంపెనీల్లో వ్యాపారాలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది. అయితే శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు ఏ మార్గంలో అపరాద రుసుం చెల్లించాలని అని అర్థంకాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.
రూ. 30 కోట్లు అపరాద రుసుం చెల్లించాలంటే అందుకు ఆదాయ పన్ను చెల్లించినట్లు పక్కా ఆధారాలు కావాలి. ఇప్పుడు ఈ ముగ్గురూ ఒక్కొక్కరు రూ. 10 కోట్లకు పైగా సంపాధించినట్లు ఆదాయ పన్ను చెల్లించారా ? లేదా ? అని న్యాయవాదులు వివరాలు సేకరిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications