అదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రే అతని అకౌంట్లోకి రూ.294 కోట్ల 80 లక్షలు !!

బ్యాంకు ఖాతాలో కొన్ని వేల రూపాయలు జమైతేనే సంతోషపడే సాధారణ ప్రజలకు, బీహార్‌లో జరిగిన ఈ ఘటన నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనం సాగించే ఓ ప్లంబర్ ఖాతాలో ఏకంగా రూ. 294 కోట్ల 80 లక్షలు జమ కావడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అంత పెద్ద మొత్తం అకౌంట్‌లో కనిపించినప్పటికీ, ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

గయా జిల్లాలో సంచలనం..

బీహార్‌లోని గయా జిల్లాకు చెందిన వికాస్ కుమార్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి జియో పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. గత ఐదేళ్లుగా అదే అకౌంట్‌ను వినియోగిస్తున్న వికాస్, సాధారణంగా చిన్నచిన్న లావాదేవీలే నిర్వహించేవాడు. ఇప్పటివరకు అతని ఖాతాలో జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్లు కూడా కొన్ని లక్షల రూపాయల పరిధిలోనే ఉండేవి.

daily-labour-from-gaya-district-in-bihar-got-294-crore-80-lakhs-cash-in-his-bank-account-and-news-go

అయితే ఇటీవల తన బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసిన వికాస్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఖాతాలో ఏకంగా రూ. 294.80 కోట్లు కనిపించడంతో ఆశ్చర్యవయాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది డబ్బు గురించి ఆలోచించే అవకాశం ఉన్నా, వికాస్ మాత్రం ఎంతో బాధ్యతగా వ్యవహరించాడు. ఖాతాలో ఉన్న మొత్తాన్ని తాకకుండా వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించాడు. ఎలాంటి నగదు ఉపసంహరణ చేయకుండా, తన ఖాతాలో భారీ మొత్తం ఎలా జమైందో వివరాలు తెలుసుకోవాలని కోరాడు. అంత పెద్ద మొత్తం అకౌంట్‌లో కనిపించడంతో మొదట ఆనందం కంటే భయం ఎక్కువగా కలిగిందని అతను తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తులో ఏవైనా చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా ముందుగానే అధికారులకు సమాచారం ఇవ్వడం మంచిదని భావించినట్లు తెలుస్తోంది.

సాంకేతిక లోపమా? లేక సైబర్ మోసమా?

ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ మొత్తం పొరపాటున వికాస్ ఖాతాలోకి వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. మరోవైపు, సైబర్ నేరాలకు సంబంధించిన అక్రమ లావాదేవీల్లో ఉపయోగించే "మ్యూల్ అకౌంట్" అయి ఉండే అవకాశాన్ని కూడా కొందరు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, పెద్ద మొత్తాల డబ్బును తాత్కాలికంగా ఇతరుల ఖాతాల్లోకి మళ్లించి అక్రమ లావాదేవీలు నిర్వహించే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం.

బ్యాంకు అధికారుల దర్యాప్తు

వికాస్ ఫిర్యాదు అనంతరం బ్యాంకు అధికారులు ఖాతా లావాదేవీలను పరిశీలిస్తున్నారు. డబ్బు ఏ ఖాతా నుంచి వచ్చింది, అది పొరపాటున జరిగిందా లేదా వ్యవస్థలో లోపం వల్ల జరిగిందా అనే విషయాలను సాంకేతిక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ఘటనపై బ్యాంకు నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పూర్తి దర్యాప్తు అనంతరం అసలు కారణం బయటపడే అవకాశం ఉంది.

నిజాయితీకి ప్రశంసలు..

అంత పెద్ద మొత్తం అకౌంట్‌లో కనిపించినా దానిని ఉపయోగించకుండా వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చిన వికాస్ కుమార్ నిజాయితీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. "కోట్ల రూపాయలు కనిపించినా ఆశపడకుండా వ్యవహరించడం గొప్ప విషయం" అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు గతంలోనూ..
ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. కొందరి ఖాతాల్లో పొరపాటున లక్షలు, కోట్ల రూపాయలు జమ కాగా, తర్వాత బ్యాంకులు వాటిని తిరిగి వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే దాదాపు రూ. 295 కోట్లకు చేరువైన మొత్తం ఒక సాధారణ వ్యక్తి ఖాతాలో కనిపించడం మాత్రం అరుదైన సంఘటనగా నిలిచింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, వికాస్ ఖాతాలోకి అంత భారీ మొత్తం ఎలా వచ్చింది? దాని వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఈ ఘటన బీహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+