కర్ణాటకలో భారీ వర్షాలు, విద్యాసంస్థలు బంద్, పర్యాటకులకు ఇబ్బంది, బెంగళూరులో!
Recommended Video

బెంగళూరు: కర్ణాటకలోని కరావళి (కోస్తా ప్రాంతం)లో భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జూన్ 8, 9వ తేది దక్షిణ కన్నడ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో బెంగళూరులో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం పడింది.
గురువార రాత్రి నుంచి దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం దక్షిణ కన్నడ జిల్లా మొత్తం వర్షాలు పడ్డాయి. వర్షం నీరు రోడ్ల మీద భారీగా నిలిచిపోవడం, రహదారులు దెబ్బతినడంతో విద్యార్థులకు ఇబ్బంది ఎదురౌతుందని అధికారులు గుర్తించారు.

శుక్రవారం, శనివారం విద్యాసంస్థలు అన్ని మూసివేయాలని దక్షిణ కన్నడ జిల్లాధికారి శశికాంత్ సెంథిల్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం, శనివారం దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
కర్ణాటక కరావళి (కోస్తా ప్రాంతం)తో పాటు మంగళూరు, ఉడిపిలో భారీ వర్షాలు పడటంతో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. పర్యాటకులు, ఉడిపికి వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు మనవి చేశారు. దక్షిణ కన్నడ జిల్లా, మంగళూరు, ఉడిపికి వచ్చిన పర్యాటకులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications