మీ భూముల ధరలు కోట్లలో ఉంది, బెంగళూరు వాళ్లకు మాయగాళ్లు, డీసీఎం vs మాజీ సీఎం ఢిష్యూమ్
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సొంత నియోజజక వర్గం అయిన కనకపురనును బెంగళూరులో కలుపుతామని డీసీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి డీకే శివకుమార్ పై విరుచుకుపడ్డారు.
కనకపుర నియోజక వర్గం రామనగర జిల్లాలో భాగంగానే ఉండాలా? లేక రాజధానిని బెంగళూరులో విలీనం చేయాలా? అదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది..దీనిపై బహిరంగ ప్రకటన చేసిన డీకే శివకుమార్ భవిష్యత్తులో బెంగళూరులో కనక్పుర భాగం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కనకపుర పరిసరాల్లో జరుగుతున్న అక్రమాలను క్రమబద్ధీకరించేందుకు డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు.

డీకే శివకుమార్ అక్రమాస్తులు విలువ పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారని మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. ఏరియాలోని ఆస్తుల యాజమాన్యం, బినామీ లావాదేవీలు, అక్రమ ఆక్రమాస్తులపై డీకే శివకుమార్ ను మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. రామనగర జిల్లా నుంచి కనకపుర తాలూకాను విడదీసి బెంగళూరులో కలపాలన్న డీకే శివకుమార్ ప్రతిపాదనను కుమారస్వామి తీవ్రంగా ఖండించారు.
గతంలో కనకపుర తాలుకా బెంగళూరు జిల్లాకు చెందినది. తరువాత కనకపుర రామనగర జిల్లాలో భాగం అయ్యిందని డీకే శివకుమార్ అంటున్నారు. అయితే ఇంతకాలం తరువాత రామనగర జిల్లాకు డీకే శివకుమార్ తీరని ద్రోహం చేశారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. కనకపుర సమీపంలోని శివనహళ్లి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో మాట్లాడిన డీకే శివకుమార్ బెంగుళూరు ప్రజలకు భూములు అమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మీరు రామనగర జిల్లాకు చెందిన వారు కాదు. మీరు బెంగళూరు గ్రామీణ జిల్లా నుంచి విడిపోయారని గుర్తుంచుకోండి, మీ ఆస్తులను బెంగళూరువాసులకు అమ్మవద్దని శివనహళ్లి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ జేబుల్లో డబ్బు పెట్టలేను, మీకు పెద్దపెద్ద ఇండ్లు కట్టివ్వలేను, కానీ మీఆస్తుల విలువ పదిరెట్లు పెంచే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు, మీరు నన్ను ఆశీర్వదించండి అంటూ డీసీఎం డీకే శివకుమార్ స్థానిక ప్రజలకు బహిరంగంగా చెప్పారు.

డీకే శివకుమార్ ప్రకటనపై విమర్శలు గుప్పించిన మాజీ సీఎం కుమారస్వామి, కనకపుర పరిసరాల్లో ఆస్తుల విలువ పెంచేందుకు డీకే శివకుమార్ తన వ్యక్తిగత ఖజానాను నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ నా ప్రతిపాదన చట్టబద్ధమైనదే అని చెప్పారు. మాజీ సీఎం కుమారస్వామి చేస్తున్న ఆరోపణలు నా పేరును దిగజారచే విదంగా ఉన్నాయని మండిపడ్డారు.
ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం ప్రజాక్షేత్రంలో అనుకూల వ్యతిరేక చర్చకు దారితీసింది. బెంగుళూరు నుండి 55 కి.మీ దూరంలో ఉన్న కనకపుర ప్రస్తుతం రామనగర జిల్లా పరిధిలోకి వస్తుంది. 2007కి ముందు కనకపుర బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలో ఉండేది. అయితే రామనగర జిల్లా ఏర్పాటు అయిన తరువాత బెంగళూరు గ్రామీణ జిల్లాలోని కనకపుర తాలుకా రామనగరలో కలిసిపోయింది. రామనగర జిల్లాను ఏర్పాటు చేసింది మాజీ సీఎం కుమారస్వామి అనే విషయం తెలిసిందే.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications