Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను రాజకీయ సన్యాసం చేస్తా, మీకు ఆ ధైర్యం ఉందా ?, డీకే సవాల్ తో మైండ్ బ్లాక్ !

బెంగళూరు: నేను ఎవరినైనా కమీషన్ అడిగి ఉంటే ఈరోజే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల్లో ఉండను అంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే, శివకుమార్ ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసిరారు. ఈ విషయమై శుక్రవారం బెంగళూరులోని సదాశివనగర్‌లో డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ నా మీద వచ్చిన ఆరోపణలు నిరూపించకపోతే మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ డీసీఎం ఆర్. అశోక్‌లు రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు.

నేను వారి ఉన్న స్థానాన్ని, సీనియారిటీని గౌరవిస్తానని, అశోక్ ఏం మాట్లాడారో నాకు బాగా తెలుసని, నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని డీకే. శివకుమార్ చెప్పారు. కాంట్రాక్టర్ ల బిల్లులపై మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్, ఆర్. అశోక్ తో సహా ప్రతిపక్ష నేతలు నా గురించి మాట్లాడుతున్నారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ బిల్లు ఎందుకు చెల్లించలేదు? అని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

DCM DK Sivakumar challenged me to do political asceticism if corruption allegations are made against me

మీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి గానీ, ఆర్. అశోక్‌కు గానీ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా ఎవరు అడ్డుకున్నారు? వాళ్ల దగ్గర డబ్బులు లేవా? అప్పట్లో మీ పదవులు సరైనవి కావా? ఈ ప్రశ్నకు ముందు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలరని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ డిమాండ్ చేశారు.

మిగిలిన వాటికి నేను కాంట్రాక్టర్‌ లకు సమాధానం ఇస్తాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కొందరు ఫిర్యాదులు చేశారు, అసలు పనులు జరిగాయో లేదో పరిశీలించడానికి అవకాశం ఇవ్వాలి కదా, కాంట్రాక్టు పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కూడా సభను అభ్యర్థించారు. అందుకే విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. పనులు పూర్తయ్యాయో లేదో పరిశీలించాలని కమిటీని ఆదేశించామని డీకే శివకుమార్ అన్నారు.

DCM DK Sivakumar challenged me to do political asceticism if corruption allegations are made against me

మూడు, నాలుగేళ్లుగా బిల్లు చెల్లించక మౌనంగా ఉన్న వారు ఇప్పుడు విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు వేచి ఉండరు? ఈ నాయకులు ఎందుకు తొందరపడుతున్నారు?, దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా ?, అని డీకే శివకుమార్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మేము 10 నుంచి 15 శాతం కమీషన్ అడిగారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఈ కమీషన్ ఎవరు అడిగారు? డీకే శివకుమార్ అడిగారా?, సీఎం సిద్ధరామయ్య అడిగారా? మంత్రులు, శాసనసభ్యులు అడిగారా?, సంబంధిత అధికారులు అడిగారా? అని చెప్పమని డీకే శివకుమార్ బీజేపీ నాయకులను నిలదీశారు. కేవలం రెండు చోట్ల మాత్రమే విచారణ జరగలేదు. ఇది ప్రతిచోటా జరుగుతుంది. పని చేస్తే బిల్లు చెల్లిస్తారు అని డీకే. శివకుమార్ అన్నారు.

DCM DK Sivakumar challenged me to do political asceticism if corruption allegations are made against me

ఇప్పుడు రెండు నెలలు వేచి ఉండలేదా? కాంట్రాక్టర్లు ఉరి వేసుకోకూడదు, బలవంతంపు మరణాన్ని కోరకోకూడదు అని అన్నారు. తమ వెనుక ఎవరున్నారో వారికి తెలుసు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలే మామూలే, కాంట్రాక్టర్లు బీజేపీ నాయకుడు అశోక్ దగ్గరకు, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి దగ్గరకు వెలుతున్నారు. తాము అధికారుల నుంచి సమాచారం అడిగామని డీకే శివకుమార్ అన్నారు.

షాంగ్రీలా హోటల్‌లో కమిషన్‌కు సంబంధించి మీటింగ్ ఉందని కాంట్రాక్టర్ కెంపన్న చెప్పలేదని, మీ తరపున ఓ అధికారి వచ్చి కమీషన్ అడిగారని చెప్పారని ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా నా మీద ఆరోపణలు చేస్తే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలని, గాలికిపోయే వాళ్లు రోడ్డు మీద నిలబడి ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+