ఐటీ చెల్లించని వారికి శుభవార్త: రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేయని వారికి శుభవార్త. ఆడిట్ రిపోర్ట్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది సీబీడీటీ. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సోమవారం ప్రకటన చేసింది.
ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31 అక్టోబరు 2018 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుందని తన ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఆడిట్ రిపోర్టు పరిశీలన తుది గడువును కూడా అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది.

ఐటీ రిటర్న్ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017-18(అసెస్మెంట్ ఇయర్ 2018-19)కి గాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి మొదట ఆగస్ట్ 31 వరకు పొడిగించారు.
ఆ తర్వాత మరోసారి తేదీని పొడిగించి సెప్టెంబరు 30కి పొడిగించారు. ఆ తర్వాత ఆ తేదీని అక్టోబరు 15 వరకు పొడిగించిన సీబీడీటీ, తాజాగా మరోసారి పదిహేను రోజులు పెంచింది. అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications