ఐటీ చెల్లించని వారికి శుభవార్త: రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేయని వారికి శుభవార్త. ఆడిట్ రిపోర్ట్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది సీబీడీటీ. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సోమవారం ప్రకటన చేసింది.
ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31 అక్టోబరు 2018 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుందని తన ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఆడిట్ రిపోర్టు పరిశీలన తుది గడువును కూడా అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది.

ఐటీ రిటర్న్ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017-18(అసెస్మెంట్ ఇయర్ 2018-19)కి గాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి మొదట ఆగస్ట్ 31 వరకు పొడిగించారు.
ఆ తర్వాత మరోసారి తేదీని పొడిగించి సెప్టెంబరు 30కి పొడిగించారు. ఆ తర్వాత ఆ తేదీని అక్టోబరు 15 వరకు పొడిగించిన సీబీడీటీ, తాజాగా మరోసారి పదిహేను రోజులు పెంచింది. అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications