Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐటీ చెల్లించని వారికి శుభవార్త: రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేయని వారికి శుభవార్త. ఆడిట్ రిపోర్ట్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది సీబీడీటీ. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సోమవారం ప్రకటన చేసింది.

ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31 అక్టోబరు 2018 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుందని తన ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఆడిట్‌ రిపోర్టు పరిశీలన తుది గడువును కూడా అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది.

Deadline For Filing IT Returns & Audit Reports Extended To 31st Oct

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017-18(అసెస్మెంట్ ఇయర్ 2018-19)కి గాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి మొదట ఆగస్ట్ 31 వరకు పొడిగించారు.

ఆ తర్వాత మరోసారి తేదీని పొడిగించి సెప్టెంబరు 30కి పొడిగించారు. ఆ తర్వాత ఆ తేదీని అక్టోబరు 15 వరకు పొడిగించిన సీబీడీటీ, తాజాగా మరోసారి పదిహేను రోజులు పెంచింది. అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+