పన్నీర్ బ్యానర్లలో 'దీప' ఫోటోలు.. రాత్రికే రాత్రే వెలిశాయి..
బ్యానర్లలో జయలలిత, పన్నీర్ సెల్వం, ఎంజీఆర్ లతో పాటు జయ మేనకోడలు దీప ఫొటోను కూడా ఉంచడం గమనార్హం.
చెన్నై: సుప్రీం తీర్పుతో చిన్నమ్మ శశికళ జైలుకు వెళ్లడం ఖాయం కాగా.. సీఎం కుర్చీ కోసం పళనిస్వామితో పన్నీర్ సెల్వం పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. శశికళకు చెక్ పెట్టగలిగితే సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమనుకున్న పన్నీర్ కు పళనిస్వామి రూపంలో మరో ప్రతికూలత ఏర్పడిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లోను ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం చేతుల్లోకి వెళ్లవద్దని భావించిన శశికళ.. పళనిస్వామిని పార్టీ శాసనాసభపక్ష నేతగా నియమించారు. మరోవైపు పన్నీర్ సెల్వం వ్యూహాలు సైతం కొత్త చర్చకు తావిస్తున్నాయి. మంగళవారం రాత్రికి రాత్రే పన్నీర్ సెల్వం ఇంటి ఎదుట పలు కొత్త బ్యానర్లు వెలిశాయి.

బ్యానర్లపై జయలలిత, పన్నీర్ సెల్వం, ఎంజీఆర్ లతో పాటు జయ మేనకోడలు దీప ఫొటోను కూడా ఉంచడం గమనార్హం. దీప జయకుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో భాగంగానే ఈ కొత్త బ్యానర్లు పుట్టుకొచ్చాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. శశికళను ఒంటరి చేసే ఉద్దేశంతో పన్నీర్ సెల్వంకు దీపజయకుమార్ మద్దతు పలుకుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
శశికళకు వ్యతిరేకంగా ఉన్నవారందరిని పన్నీర్ సెల్వం తన శిబిరంలో చేర్చుకుని ముందుకు సాగుతున్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలంతా పళనిస్వామి వైపే ఉండటంతో పన్నీర్ పాచికలు ఎంతవరకు పారుతాయన్నది వేచిచూడాలి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications