'జయ' చికిత్సకు సంతకాలు పెట్టినవాళ్లెవరో బయటపెట్టండి: దీప డిమాండ్
సంతకాలు చేసిన ఆ కుటుంబీకులు, బంధువులు ఎవరో.. వారి వివరాలను బహిర్గతం చేయాలని దీప డిమాండ్ చేశారు.
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై ఇంకా అనుమానాలు రేగుతూనే ఉన్నాయి. ఎయిమ్స్ రిపోర్టులు, ప్రభుత్వం వివరణ పట్ల సంతృప్తి చెందని పలువురు అమ్మ మరణంపై అనుమానాలను లేవనెత్తుతున్నారు.
ముఖ్యంగా జయలలిత మేనకోడలు దీప జయకుమార్, మాజీ సీఎం పన్నీర్ సెల్వం జయలలిత మృతిపై విచారణకు పట్టుబడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన దీప జయకుమార్.. జయలలిత మృతిపై విచారణ జరపించాల్సిందేనని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
[11.30-4.30.. అప్పుడు చనిపోలేదు: జయలలిత మృతిపై పన్నీరుసెల్వం బాంబు]
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జయలలిత చికిత్స వివరాలను ఈ సందర్బంగా దీప ప్రస్తావించారు. 'జయలలితకు ఎక్మో వంటి చికిత్సలు అందించేందుకు బంధువుల సంతకాలు తీసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జయలలితకు రక్తసంబంధీకులుగా నాతో పాటు, నా సోదరుడు మాత్రమే ఉన్నాం. మేమిద్దరం ఆసుపత్రిలో సంతకాలు చేయలేదు.' అని దీప అన్నారు.
సంతకాలు చేసిన ఆ కుటుంబీకులు, బంధువులు ఎవరో.. వారి వివరాలను బహిర్గతం చేయాలని దీప డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో మేనత్త మరణం పట్ల తమలో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని, కాబట్టి దీనిపై న్యాయ విచారణ చేయించాల్సిందేనని దీప స్పష్టం చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications