'జయ' చికిత్సకు సంతకాలు పెట్టినవాళ్లెవరో బయటపెట్టండి: దీప డిమాండ్
సంతకాలు చేసిన ఆ కుటుంబీకులు, బంధువులు ఎవరో.. వారి వివరాలను బహిర్గతం చేయాలని దీప డిమాండ్ చేశారు.
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై ఇంకా అనుమానాలు రేగుతూనే ఉన్నాయి. ఎయిమ్స్ రిపోర్టులు, ప్రభుత్వం వివరణ పట్ల సంతృప్తి చెందని పలువురు అమ్మ మరణంపై అనుమానాలను లేవనెత్తుతున్నారు.
ముఖ్యంగా జయలలిత మేనకోడలు దీప జయకుమార్, మాజీ సీఎం పన్నీర్ సెల్వం జయలలిత మృతిపై విచారణకు పట్టుబడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన దీప జయకుమార్.. జయలలిత మృతిపై విచారణ జరపించాల్సిందేనని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
[11.30-4.30.. అప్పుడు చనిపోలేదు: జయలలిత మృతిపై పన్నీరుసెల్వం బాంబు]
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జయలలిత చికిత్స వివరాలను ఈ సందర్బంగా దీప ప్రస్తావించారు. 'జయలలితకు ఎక్మో వంటి చికిత్సలు అందించేందుకు బంధువుల సంతకాలు తీసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జయలలితకు రక్తసంబంధీకులుగా నాతో పాటు, నా సోదరుడు మాత్రమే ఉన్నాం. మేమిద్దరం ఆసుపత్రిలో సంతకాలు చేయలేదు.' అని దీప అన్నారు.
సంతకాలు చేసిన ఆ కుటుంబీకులు, బంధువులు ఎవరో.. వారి వివరాలను బహిర్గతం చేయాలని దీప డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో మేనత్త మరణం పట్ల తమలో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని, కాబట్టి దీనిపై న్యాయ విచారణ చేయించాల్సిందేనని దీప స్పష్టం చేశారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications