మరికొన్ని గంటల్లో ఎర్రకోటపై ఎగరనున్న మువ్వన్నెల జెండా, 4 వేల మందికే అనుమతి..
74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. ఢిల్లీలో గల ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 7.30 గంటలకు మోడీ జెండాను ఎగరేస్తారు. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరం, మాస్క్ ధరించడం, అందుబాటులో శానిటైజర్లు, థర్మల్ స్రీనింగ్ ద్వారా కోటలోకి ప్రవేశించే జాగ్రత్తలు తీసుకున్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వల్ల అతిథుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏటా 30 వేల మందితో నిర్వహించే సంబురం. 4 వేల మందికి కుదించారు. అలాగే 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనబొతున్నారు. ఈ సారి విద్యార్థులు కూడా పాల్గొనడం లేదు. కొద్ది మంది అతిథుల కోసం భౌతిక దూరంతో కుర్చీలను ఏర్పాటు చేశారు. విదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కరోనాను జయించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులను మాత్రమే వేడుకలకు ఆహ్వానించారు.
ఇద్దరి మధ్య రెండు యార్డుల దూరం ఉండేలా కుర్చీల ఏర్పాటు చేసినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. కోట సమీపంలో నాలుగు టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆయా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినా తర్వాత లోపలికి అనుమతిస్తారు. అతిథులు కూడా విధిగా మాస్కులు ధరించాలని.. మాస్క్ తీసుకురాకుంటే వారికి అందజేసేందుకు మాస్క్లను కూడా అందుబాటులో ఉంచారు. శానిటైటర్లను కూడా ఉన్నాయని తెలిపారు.
ప్రధాని మోదీ ఉదయం 7.21 గంటలకు ఎర్రకోటకు చేరుకుంటారు. ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్, చైనా, వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ తదితర కీలక అంశాలపై మోడీ ప్రసంగించనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications