ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 2025 Live: ముగిసిన పోలింగ్- ఈవీఎంలలో అభ్యర్థుల జాతకం..!!
ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు 57.7శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడుతాయి. మొత్తానికి ఢిల్లీలో ట్రయాంగిల్ ఫైట్ నెలకొందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వెల్లడించారు.

కేజ్రీవాల్ అవినీతి చేశాడంటూ బీజేపీ ఆరోపించగా,తాము చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాడు ఢిల్లీ మాజీ సీఎం. విద్యా వైద్యరంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను తన ప్రచారాస్త్రంగా సంధించారు కేజ్రీవాల్. ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం, పోలీసులు కుమ్మక్కయారంటూ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కాంగ్రెస్ కూడా బీజేపీ , ఆమ్ ఆద్మీ పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టింది. మొత్తానికి వాడీ వేడీగా సాగిన ప్రచారం ముగియడంతో ఢిల్లీ రాష్ట్ర మంతా సైలెంట్గా మారిపోయింది. ఇక ఓటు అనే ప్రధాన ఆయుధం ప్రజల వద్ద ఉండటంతో అన్ని పార్టీలు భవిష్యత్తు ఓటరు చేతిలోకి వెళ్లిపోయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతాయి. ఇక ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.
AAP national convener Arvind Kejriwal, along with his wife Sunita Kejriwal and parents Gobind Ram Kejriwal & Gita Devi cast their votes for #DelhiElection2025.
— ANI (@ANI) February 5, 2025
(Pics: AAP) pic.twitter.com/VrWbk4nGCq
#WATCH | Raipur | On #DelhiAssemblyElection2025, Chhattisgarh Deputy CM Arun Sao says, "...The people of Delhi are voting for change, to form a double-engine government. Certainly, the Lotus will bloom in Delhi and the BJP government will be formed... The Congress party has… pic.twitter.com/sxIDpWvgig
— ANI (@ANI) February 5, 2025












Click it and Unblock the Notifications