ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి: అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఒక విమానాన్ని టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షి ఢీకొట్టింది. దీంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో సోమవారం చోటు చేసుకుంటుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 6ఈ2065 విమానం 180 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకు ఒక పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం ఎడమ రెక్కలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు.

విమానాన్ని అత్యవసరంగా భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమనాశ్రయానికి మళ్లించారు. సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు.
పక్షులు విమానాలను ఢీకొనడం లాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. చిన్న ఘటనే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తారు పైలట్లు. కాగా, ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications