తప్పిన పెనుప్రమాదం: పక్షి డీకొనడంతో విమానంలో మంటలు, పాట్నాలో ల్యాండింగ్
న్యూఢిల్లీ: స్పైస్జెట్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం బయల్దేరిన కాసేపటికే మార్గమధ్యలోనే మంటలు చెలరేగడంతో బీహార్లోని పాట్నాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. నివేదికల ప్రకారం.. ఢిల్లీకి స్పైస్జెట్ విమానం పాట్నా విమానాశ్రయం నుంచి బయలుదేరింది, అయితే దాని ఇంజిన్లో మంటలు వ్యాపించడంతో తిరిగి విమానాశ్రయానికి వెళ్లవలసి వచ్చింది.
ఏఎన్ఐ ప్రకారం.. విమానంలో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయి. జెట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణీకులందరూ క్షేమంగా ఉన్నారు.
విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో 185 మంది ప్రయాణిస్తున్న విమానం పాట్నా విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఎటువంటి గాయాలు లేదా మరణాలు నమోదు కాలేదు.
#WATCH Delhi bound SpiceJet flight returns to Patna airport after reporting technical glitch which prompted fire in the aircraft; All passengers safely rescued pic.twitter.com/Vvsvq5yeVJ
— ANI (@ANI) June 19, 2022
"విమానంలో మంటలను స్థానికులు గమనించి.. జిల్లా, విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించడంతో ఢిల్లీ వెళ్లే విమానం తిరిగి పాట్నా విమానాశ్రయానికి చేరుకుంది. మొత్తం 185 మంది ప్రయాణికులు సురక్షితంగా దిగారు. దీనికి కారణం సాంకేతిక లోపం. ఇంజినీరింగ్ బృందం మరింత విశ్లేషిస్తోంది' అని పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్ పేర్కొన్నారు.
డీజీసీఏ అధికారుల ప్రకారం.. పక్షుల కారణంగానే.. తరచుగా ఇంజిన్లో మంటలకు దారితీస్తుంది. పైలట్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజిన్ను షట్ డౌన్ చేసిన తర్వాత ప్రయాణికులంతా సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.
స్పైస్జెట్ స్పోక్స్ ప్రకారం.. టేకాఫ్ తర్వాత, పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్జెట్ విమానం కాక్పిట్ సిబ్బంది ఇంజన్ నెం. 1. ముందుజాగ్రత్తగా, ఎయిర్క్రాఫ్ట్ కెప్టెన్ సమస్యాత్మక ఇంజిన్ను స్విచ్ ఆఫ్ చేసి పాట్నాకు తిరిగి వచ్చారు. విమానానంతర తనిఖీలో పక్షి ఢీకొని దాని మూడు ఫ్యాన్ బ్లేడ్లు దెబ్బతిన్నాయని వెల్లడైంది.